Share News

AP News: పులివెందుల ఎమ్మెల్యే జగన్‌పై మంత్రి లోకేశ్‌ తీవ్ర ఆగ్రహం

ABN , Publish Date - Jun 23 , 2024 | 11:17 AM

ఏపీలోని ప్రతి జిల్లాలో భూముల ఆక్రమణలకు పాల్పడి పార్టీ ఆఫీసుల పేరిట రాజప్రసాదాలు నిర్మించడంపై ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. మాజీ సీఎం, పులివెందుకు ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP News: పులివెందుల ఎమ్మెల్యే జగన్‌పై మంత్రి లోకేశ్‌ తీవ్ర ఆగ్రహం

అమరావతి: ఏపీలోని ప్రతి జిల్లాలో భూముల ఆక్రమణలకు పాల్పడి పార్టీ ఆఫీసుల పేరిట రాజప్రసాదాలు నిర్మించడంపై ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా!’’ అని జగన్‌ను ప్రశ్నించారు. వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావని, జనం నుంచి దోచుకున్న రూ.500 కోట్లతో ప్యాలెస్‌లు కడుతున్నావని మండిపడ్డారు.


‘‘ నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన రూ.600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4,200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే రూ.500 కోట్లతో 25 వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు. ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి?. నీ ధనదాహానికి అంతులేదా?’’ అని లోకేశ్ ఎక్స్ వేదికగా ఆదివారం స్పందించారు. ఈ మేరకు మీడియాలో వెలువడిన పలు క్లిప్పింగులను ఆయన షేర్ చేశారు.

Updated Date - Jun 23 , 2024 | 11:27 AM