Share News

AP Elections: రాప్తాడులో ఉద్రిక్తతల నడుమే పోలింగ్

ABN , Publish Date - May 13 , 2024 | 12:08 PM

Andhrapradesh: రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్తతల మధ్య పోలింగ్ సాగుతోంది. పోలింగ్ బూతుల వద్ద వైసీపీ నాయకులు హల్‌చల్ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను వైసీపీ నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అత్యంత సమస్యాత్మక గ్రామంగా ఉన్న మద్దలచెరువులో పోలీసులు వైఫల్యం చెందారు. కేవలం ఒక్క హోంగార్డును మాత్రమే ఎన్నికల విధులకు కేటాయించారు.

AP Elections: రాప్తాడులో ఉద్రిక్తతల నడుమే పోలింగ్
Raptadu Polling

అనంతపురం, మే 13: రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్తతల మధ్య పోలింగ్సా (AP Elections 2024)గుతోంది. పోలింగ్ బూతుల వద్ద వైసీపీ నాయకులు హల్‌చల్ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను వైసీపీ నాయకులు (YSRCP Leaders) భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అత్యంత సమస్యాత్మక గ్రామంగా ఉన్న మద్దలచెరువులో పోలీసులు వైఫల్యం చెందారు. కేవలం ఒక్క హోంగార్డును మాత్రమే ఎన్నికల విధులకు కేటాయించారు. నమూనా ఈవీఎంతో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ నేతలు ప్రచారం చేస్తున్న పరిస్థితి. బహిరంగంగా ప్రచారం చేస్తున్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లుగా ఉండిపోయారు.

Lok Sabha Polls: ఓటు వేసిన కేటీఆర్.. ఆయనకే ఓటు వేశానని ఆసక్తికర కామెంట్స్


నెమలివరం గ్రామంలో టీడీపీ నాయకులతో వైసీపీ నేతలు పలుమార్లు గొడవలకు దిగారు. దీంతో ఇప్పటికే రెండు మూడు సార్లు పోలింగ్ నిలిపివేశారు. మేడాపురం గ్రామంలో వైసీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఓటర్లను ప్రలోభపెడుతున్న క్రమంలో టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో వారిపై అధికార పార్టీ నేతలు దాడగులకు తెగబడుతున్నారు. నామాల గ్రామంలో కూడా వైసీపీ నాయకులు బరితెగింపు చర్యలకు పాల్పడ్డారు. ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు, అధికారుల ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల టీడీపీ నేతలు, ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

AP Elections: తిరుపతిరావు, కేశినేని చిన్ని పోటాపోటీ ఆరోపణలు..

Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా తొలి రెండు గంటల్లో నమోదైన పోలింగ్ శాతం ఇదే..

Read Latest AP News And Telugu News

Updated Date - May 13 , 2024 | 12:13 PM