Share News

BC Janardhan: ఎసెన్షియా కంపెనీ దుర్ఘటన అత్యంత బాధాకరం

ABN , Publish Date - Aug 22 , 2024 | 11:33 AM

Andhrapradesh: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీ దుర్ఘటన అత్యంత బాధాకరమని రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఈ ప్రమాదంలో 17మంది దుర్మరణం చెందడం తీవ్రంగా కలచివేస్తోందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

BC Janardhan:  ఎసెన్షియా కంపెనీ దుర్ఘటన అత్యంత బాధాకరం
Minister BC Janardhanreddy

అమరావతి, ఆగస్టు 22: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీ దుర్ఘటన అత్యంత బాధాకరమని రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి (Minister BC Janardhan Reddy) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఈ ప్రమాదంలో 17మంది దుర్మరణం చెందడం తీవ్రంగా కలచివేస్తోందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Vijay: పార్టీ జెండా, గీతాన్ని ఆవిష్కరించిన విజయ్‌..


మృతుల కుటుంబాలకు ప్రభుత్వం (AP Govt) అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం నుండి మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ప్రకటించడం జరిగిందన్నారు. క్షతగాత్రులను కూడా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. గాయపడిన వారికి ప్రభుత్వం ఇప్పటికే మెరుగైన వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంపెనీ యాజమాన్యంపై ఇప్పటికే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపట్టిందని మంత్రి బీసీ జానర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

US Arrest: రహస్య కెమెరాలతో మహిళలు, పిల్లల నగ్న వీడియోలు..



కాగా.. అచ్యుతాపురం ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారాన్ని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల పరిహారాన్ని కేంద్రం ప్రకటించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారాన్ని ప్రభుత్వం తరుఫున విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ప్రకటించారు. కేజీహెచ్‌లో మార్చురీ వద్ద మృతుల కుటుంబ సభ్యులను కలెక్టర్ ఓదార్చారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అచ్యుతాపురం సెజ్ బాధితులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని..భాదితులకు అండగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు.


ఇవి కూడా చదవండి...

Harish Rao: యాదాద్రికి బయలు దేరిన హరీష్‌రావు.. నేడు రుణమాఫీపై బీఆర్ఎస్ ధర్నా

వినేశ్‌.. పంట పండింది!

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 22 , 2024 | 12:37 PM