Share News

Traffic: నేడు ట్రాఫిక్ మళ్లింపు.. ఏ ఏ ఏరియాల్లోనంటే..

ABN , Publish Date - Jun 27 , 2024 | 08:07 AM

ఇవాళ విజయవాడలో ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు సంస్మరణ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు విజయవాడలో అధికారులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రామోజీరావు సంస్కరణ సభ నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

Traffic: నేడు ట్రాఫిక్ మళ్లింపు.. ఏ ఏ ఏరియాల్లోనంటే..

అమరావతి: ఇవాళ విజయవాడలో ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు సంస్మరణ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు విజయవాడలో అధికారులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రామోజీరావు సంస్కరణ సభ నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే అన్ని రకాల వాహనాల రాకపోకలను రామలింగేశ్వర నగర్, కరకట్ట మీదుగా పెనమలూరుకు మళ్లించనున్నారు. తాడిగడప 100 అడుగుల రోడ్డును మధ్యాహ్నం రెండు గంటల నుంచి పూర్తిగా మూసివేయనున్నారు. ప్రత్యామ్నాయంగా రాకపోకలను పోరంకి నిడమానూరు మీదుగా మళ్లించనున్నారు.

Updated Date - Jun 27 , 2024 | 08:07 AM