CM Jagan: చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు
ABN , Publish Date - Jan 27 , 2024 | 09:23 PM
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని సీఎం జగన్(CM Jagan) వ్యాఖ్యానించారు. శనివారం నాడు సిద్ధం పేరుతో ఉత్తరాంధ్ర కార్యకర్తల నేతల సమావేశం నిర్వహించారు.

విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని సీఎం జగన్(CM Jagan) వ్యాఖ్యానించారు. శనివారం నాడు సిద్ధం పేరుతో ఉత్తరాంధ్ర కార్యకర్తల నేతల సమావేశం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.... టీడీపీకి చాలా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా లేరన్నారు. అబద్దానికి, నిజానికి మధ్య, మోసానికి, విశ్వసనీయత మధ్య ఈ ఎన్నికల యుద్ధం జరుగుతోందన్నారు. 10 శాతం వాగ్దానాలు కూడా అమలు చేయని చంద్రబాబు గురుంచి ఇంటింటికీ వెళ్లి చెప్పాలని అన్నారు.
కార్యకర్తలను కాదని వలంటీర్ల చేతిలో అధికారం అంతా పెట్టారని బాధ పడొద్దని చెప్పారు. వలంటీర్లు ఎవరో కాదు, మనలో ఒకరు, మన వాళ్లేనని తెలిపారు. మనలో ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలిపించుకునే సత్తా మనకు ఉందన్నారు. ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ 2024 ఎన్నికలకు సిద్ధం అని ప్రకటించారు. ప్రతిపక్షాలకు ఓటు వేయడం అంటే.. సంక్షేమ పథకాలు వద్దని చెప్పడమేనని సీఎం జగన్ పేర్కొన్నారు.