Share News

Mount Everest: నేపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భారతీయుడు మృతి

ABN , Publish Date - May 28 , 2024 | 07:14 PM

మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తు తీవ్ర అనారోగ్యానికి గురై ఖట్మాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయుడు బన్సీలాల్ మృతి చెందినట్లు నేపాల్ పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు.

Mount Everest: నేపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భారతీయుడు మృతి

ఖట్మాండ్, మే 28: మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తూ తీవ్ర అనారోగ్యానికి గురై ఖట్మాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయుడు బన్సీలాల్ సోమవారం మృతి చెందాడు. ఈ మేరకు నేపాల్ పర్యాటక శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. దీంతో ఈ సీజన్‌లో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరిందన్నారు.

మృతుడు బన్షిలాల్‌.. గత వారం మౌంట్ ఎవరెస్ట్ అధిరోహిస్తూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని తెలిపారు. దాంతో చికిత్స కోసం అతడిని హెలికాఫ్టర్‌లో నేపాల్ రాజదాని ఖట్మాండ్‌లోని ఆసుపత్రికి తరలించామన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడని చెప్పారు. అయితే గతేడాది ఇదే సీజన్‌లో 18 మంది పర్వతారోహకులు మరణించారని నేపాల అధికారులు ఈ సందర్బంగా గుర్తు చేశారు.

VK Pandian: బీజేపీ సెల్ఫ్ గోల్.. బీజేడీకీ లాభం


Karnataka: మాజీ సీఎంపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ మృతి

ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మంచు పర్వతాలు 10 ఉన్నాయి. వాటిలో ఎనిమిది నేపాల్‌లోనే ఉన్నాయి. అయితే ఈ సీజన్‌లో వందాలది మంది ఈ పర్వతాలను అధిరోహించేందుకు ఆసక్తి చూపుతారు. ఇక ఎవరెస్ట్ శిఖరం అధిరోహించే క్రమంలో 26,200 అడుగులకు చేరుకోగానే ఆక్సిజన్ అంతగా అందదు. దీంతో ఈ ప్రాంతానికి రాగానే పలువురు పర్వతారోహకులు తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని డెత్ జోన్‌గా పేర్కొంటారు. మరోవైపు ఈ ఏడాది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు 900 మందికి నేపాల్ అనుమతి మంజూరు చేసింది.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 28 , 2024 | 07:19 PM