Share News

17 మంది ఐసిస్‌ సభ్యులపై ఎన్‌ఐఏ ఛార్జిషీటు

ABN , Publish Date - Jun 04 , 2024 | 04:46 AM

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ‘ఐసి్‌స’లో కరుడుగట్టిన సభ్యులుగా పనిచేస్తున్న 17 మందిపై ఎన్‌ఐఏ సోమవారం ఛార్జిషీటు దాఖలు చేసింది. బాంబులు తయారు చేయడం, యువతను ఉగ్రవాదంవైపు మళ్లించడం,

17 మంది ఐసిస్‌ సభ్యులపై ఎన్‌ఐఏ ఛార్జిషీటు

న్యూఢిల్లీ, జూన్‌ 3: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ‘ఐసి్‌స’లో కరుడుగట్టిన సభ్యులుగా పనిచేస్తున్న 17 మందిపై ఎన్‌ఐఏ సోమవారం ఛార్జిషీటు దాఖలు చేసింది. బాంబులు తయారు చేయడం, యువతను ఉగ్రవాదంవైపు మళ్లించడం,

నిధులు సేకరించడం వంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. గత ఏడాది పటియాలా హౌస్‌లోని ప్రత్యేక కోర్టులో ముగ్గురు ఐసిస్‌ సభ్యులపై ఛార్జిషీటు దాఖలు చేసింది. వారిపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ 17 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. దాంతో వారిపై ఆరోపణలను నమోదు చేస్తూ అదనపు అభియోగపత్రాలను కోర్టులో సమర్పించింది.

Updated Date - Jun 04 , 2024 | 04:46 AM