Share News

CM Chandrababu: అస్సలు తగ్గొద్దు.. గట్టిగా ఇచ్చి పడేయండి!

ABN , Publish Date - Jul 25 , 2024 | 10:21 PM

ఎవ్వరూ తగ్గొద్దు.. అస్సలు తగ్గొద్దంటే తగ్గొద్దు అంతే..! గట్టిగా ఇచ్చి పడేయండి.. ఇందులో ఏ మాత్రం వెనుకంజ వేయొద్దు..! వైసీపీ (YSR Congress) చేసే రాజకీయ విమర్శలకు మంత్రులందరూ ధీటుగా బదులిచ్చి తీరాల్సిందే..!

CM Chandrababu: అస్సలు తగ్గొద్దు.. గట్టిగా ఇచ్చి పడేయండి!

ఎవ్వరూ తగ్గొద్దు.. అస్సలు తగ్గొద్దంటే తగ్గొద్దు అంతే..! గట్టిగా ఇచ్చి పడేయండి.. ఇందులో ఏ మాత్రం వెనుకంజ వేయొద్దు..! వైసీపీ (YSR Congress) చేసే రాజకీయ విమర్శలకు మంత్రులందరూ ధీటుగా బదులిచ్చి తీరాల్సిందే..! ఇదీ ఏపీ కేబినెట్‌ (AP Cabinet) సమావేశంలో మంత్రులకు సీఎం నారా చంద్రబాబు చేసిన దిశానిర్దేశం. గురువారం నాడు అసెంబ్లీ సమావేశాల్లో శాంతి భద్రతలపై శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత.. సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం ప్రకటించిన నిధులు, పోలవరం, అమరావతి.. వైసీపీ విమర్శలపై ఇలా అన్ని విషయాలపైనా నిశితంగా చర్చించారు.


Chandrababu.jpg

ఎవ్వరూ తగ్గొద్దు..!

కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే పనిగట్టుకుని మరీ వైసీపీ విమర్శలు గుప్పిస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా.. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని, శాంతి భద్రతలు అదుపు తప్పాయని గల్లీ మొదలుకుని ఢిల్లీ వరకూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అండ్ కో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అయితే.. అదంతా అక్షరాలా తప్పు అనే విషయాన్ని ఇప్పటికే తిప్పి కొట్టిన మంత్రులు, ఆఖరికి వైసీపీ హయాంలో జరిగిన నేరాలు, ఘోరాలు.. కేసులపై కూడా మొత్తమ్మీద శాంతి భద్రతలపై చంద్రబాబు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అందుకే ఇకపై వైసీపీ నుంచి ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా సరే.. ధీటుగా ఎదుర్కొని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి తీరాల్సిందేనని మంత్రులకు (AP Cabinet Ministers) సీఎం సూచించారు. ఈ విషయంలో ఎక్కడా ఎవరూ వెనకడుగు వేయొద్దని కేబినెట్ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. క్లియర్ కట్‌గా సబ్జక్టుతోనే అది కూడా మీడియా ఎలాంటి ప్రశ్నలు అడిగినా సరే తడబడకుండా మాట్లాడేలా ఉండాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైతే జూనియర్లు, సీనియర్లతో సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని, ఇందులో ఎలాంటి మొహమాటాలు, ప్రిస్టేజ్‌లకు పోకుండా ఉండాలని కూడా సూచించినట్లుగా సమాచారం.


Chandrababu-Cabinet.jpg

ఇంకా ఏమేం చర్చించారు..?

కేబినెట్‌లో పోలవరం ప్రాజెక్టులోని డయాఫ్రాం వాల్ నిర్మాణంపై కూడా చర్చించారు. కొత్త డయాఫ్రాం వాల్ నిర్మాణ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త డయాఫ్రాం వాల్ నిర్మాణం కోసం ఢిల్లీలో ఈ నెల 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ ప్రతిపాదించనున్నది. నీతి ఆయోగ్ సమావేశంలో డయాఫ్రాంవాల్ నిర్మాణ ప్రతిపాదనలను పెట్టనున్నారు సీఎం. నీతి ఆయోగ్‌లో ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తప్పనిసరి కావటంతో ఏపీ కేబినెట్‌లో చర్చించారు. దీంత పాటు.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా గతంలో నిర్దేశించిన దానికే కట్టుబడి ఉండేలా చూడాలని కేబినెట్‌లో తీర్మానించింది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత తామే తీసుకుంటామని కేంద్రం చెప్పడం పైనా కేంద్రాన్ని అభినందిస్తూ తీర్మానం చేయడం జరిగింది. దీంతోపాటు బడ్జెట్‌లో ఏపీకి అధిక ప్రాధాన్యం ఇవ్వటంపైనా, అమరావతికి కేటాయించిన నిధుల పైనా కేంద్రాన్ని అభినందిస్తూ కేబినెట్‌లో తీర్మానించింది. మరోవైపు.. కేంద్ర నిధుల విషయంలో మంత్రులు సమన్వయం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. మొత్తానికి చూస్తే.. ఇకపై వైసీపీ నుంచి ఎలాంటి కామెంట్స్, విమర్శలు వచ్చినా అంతకు రెట్టింపుగానే కౌంటర్ ఎటాక్ ఉండబోతోందన్న మాట.

AP-Cabinet.jpg

వైఎస్ వివేకా హత్యకేసులో ఊహించని ట్విస్ట్

Updated Date - Jul 25 , 2024 | 10:25 PM