Share News

Women: ఇంటికి రాగానే ప్రియుడితో కలిసి ఉన్న తల్లి.. చివరకు అతడి నిర్వాకం తెలుసుకున్న కొడుకు..

ABN , Publish Date - Jun 16 , 2024 | 08:26 PM

కొందరు తప్పని తెలిసినా తప్పు మీద తప్పులు చేస్తూ చివరకు జైలు జీవితం గడుపుతుంటారు. మరికొందరు విధిలేని పరిస్థితుల్లో తప్పులు చేస్తూ చివరకు చిక్కుల్లో పడుతుంటారు. ప్రధానంగా వివాహేతర సంబంధాల విషయంలో ..

Women: ఇంటికి రాగానే ప్రియుడితో కలిసి ఉన్న తల్లి.. చివరకు అతడి నిర్వాకం తెలుసుకున్న కొడుకు..
ప్రతీకాత్మక చిత్రం

కొందరు తప్పని తెలిసినా తప్పు మీద తప్పులు చేస్తూ చివరకు జైలు జీవితం గడుపుతుంటారు. మరికొందరు విధిలేని పరిస్థితుల్లో తప్పులు చేస్తూ చివరకు చిక్కుల్లో పడుతుంటారు. ప్రధానంగా వివాహేతర సంబంధాల విషయంలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతుంటాయి. ఇలాంటి ఘటనకు మన చుట్టూ నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిర్మాణంలో ఉన్న ఇంట్లో తల్లిని ప్రియుడితో కలిసి చూసిన కొడుకు.. చివరకు ఈ వ్యక్తి చేసిన నిర్వాకం తెలుసుకుని దారుణానికి పాల్పడ్డాడు.


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) వైరల్ అవుతోంది. కర్నాటక (Karnataka) పరప్ప అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధి కుడ్లు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన రాజేశ్వరికి శివకుమార్ అనే కొడుకు ఉన్నాడు. అయితే ఆమె చాలా సంవత్సరాలుగా భర్తకు దూరంగా కొడుకుతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం కృష్ణాజీరావు (37) తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా కొన్నా్ళ్లకు (extramarital affair) వివాహేతర సంబంధానికి దారి తీసింది.

Viral video: వామ్మో..! తల్లిని మించిపోయిన దూడ.. ఏనుగుకు ఎదురుగా వెళ్లి మరీ..


తర్వాత ఆమె కొడుకుతో సహా కృష్ణాజీరావు వద్దే ఉండేది. ముగ్గురూ కలిసి నిర్మాణంలో ఉన్న భవనంలో ఉండేవారు. ఇలావుండగా, ఇటీవల వీరి ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. కృష్ణాజీరావు రోజూ తాగి వచ్చి రాజేశ్వరితో గొడవపడేవాడు. అంతటితో ఆగకుండా ఏదో ఒక సాకు చూపుతూ ఆమెపై దాడి చేసేవాడు. ఇలా రోజూ ఆమెను చిత్రహింసలకు గురి చేసేవాడు. అయినా తల్లీకొడుకు అతడిని ఏమీ అనకుండా భరిస్తూ వచ్చారు. అయితే ఇటీవల చిత్రహింసలు మరింత పెరగడంతో ఇద్దరికీ సహనం నశించింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం కృష్ణాజీరావు ఫుల్‌గా మందు తాగి వచ్చాడు.

Viral video: మసాజ్ చేస్తున్న సమయంలో.. కస్టమర్ కళ్లు మూసుకోగానే.. ఇతడు చేసిన నిర్వాకం..


యథావిధిగా ఆమెతో గొడవపడి దాడి చేశాడు. అప్పుడే ఇంటికి వచ్చిన శివకుమార్.. తన తల్లిపై కృష్ణాజీరావు దాడి చేయడాన్ని చూసి రగిలిపోయాడు. వెంటనే పక్కనే ఉన్న కర్రతో అతడిపై దాడి చేశాడు. తర్వాత తల్లీకొడుకు కలిసి (Woman attacked boyfriend with son) అతడిని చితకబాదారు. ఈ దాడిలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాజేశ్వరి, ఆమె కొడుకు శివకుమార్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral: పెళ్లి జరుగుతుండగా వేదిక వెనుక వైపు వెళ్లిన వరుడు.. అనుమానం వచ్చి వధువు కూడా వెళ్లగా.. చివరకు..

Updated Date - Jun 16 , 2024 | 08:36 PM