Share News

నీరజ్‌.. స్వర్ణం మిస్‌

ABN , Publish Date - May 11 , 2024 | 05:09 AM

ఒలింపిక్‌, వరల్డ్‌ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా దోహా డైమండ్‌ లీగ్‌లో త్రుటిలో స్వర్ణ పతకాన్ని మిస్సయ్యాడు. శుక్రవారం రాత్రి జరిగిన జావెలిన్‌ త్రో ఈవెంట్‌

నీరజ్‌.. స్వర్ణం మిస్‌

దోహా డైమండ్‌ లీగ్‌లో రెండో స్థానం

దోహా: ఒలింపిక్‌, వరల్డ్‌ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా దోహా డైమండ్‌ లీగ్‌లో త్రుటిలో స్వర్ణ పతకాన్ని మిస్సయ్యాడు. శుక్రవారం రాత్రి జరిగిన జావెలిన్‌ త్రో ఈవెంట్‌ చివరి ప్రయత్నంలో నీరజ్‌ 88.36 మీ. దూరం ఈటెను విసిరి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జాకబ్‌ వాడ్లేచ్‌ 88.38 మీ. దూరం విసిరి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. కేవలం రెండు సెంటీమీటర్ల దూరంతో నీరజ్‌ టైటిల్‌ కోల్పోయాడు. గత ఏడాది ఇక్కడ నీరజ్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనడా) 86.62 మీ. దూరంతో మూడో స్థానం సాధించాడు. ఇక తొలిసారి డైమండ్‌ లీగ్‌ బరిలో దిగిన భారత మరో జావెలిన్‌ త్రోయర్‌ శ్రీకాంత్‌ జెనా (76.31 మీ.) పదిమందిలో తొమ్మిదో స్థానంలో నిలిచాడు.

Updated Date - May 11 , 2024 | 05:10 AM