ఫతేపూర్లో ఘనంగా బొడ్రాయి పండుగ
ABN , Publish Date - Mar 30 , 2024 | 11:23 PM
మండలంలోని ఫతేపూర్ గ్రామంలో శనివారం బొడ్రాయి వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు.

మహబూబ్నగర్రూరల్, మార్చి 30 : మండలంలోని ఫతేపూర్ గ్రామంలో శనివారం బొడ్రాయి వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఊరంతా పెద్దఎత్తున పాల్గొన్న ప్రజలు బొడ్రాయిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొని పూజలు చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆ కాంక్షించారు. అనంతరం ఫత్తేపూర్లోని భూదేవిశ్రీదేవి సమేత వేంకటేశ్వరస్వామిని, కొండపై వెలిసిన రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్, చెన్న య్య, పాండు, నర్సింహ, నరేశ్, కృష్ణాజి, బాలరాజు, సిరాజ్ఖాద్రి, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.
ఫ మాజీమంత్రి, ఎంపీ ప్రత్యేక పూజలు : మాజీమంత్రి వి. శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డ్డిలు బొడ్రాయి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డిని గెలిపించాలని కోరారు. నాయకులు రాజేశ్వర్గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, ఎంపీటీసీ కృష్ణయ్య, కృష్ణయ్యగౌడ్, రాఘవేందర్గౌడ్ పాల్గొన్నారు.