Share News

Kaleswaram Project: అన్నారం సరస్వతీ బ్యారేజ్‌లో నిపుణుల‌ బృందం పరీక్షలు

ABN , Publish Date - Jun 22 , 2024 | 09:35 AM

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని అన్నారం సరస్వతీ బ్యారేజ్ లో సిడబ్ల్యూపిఆర్ఎస్ నిపుణుల‌ బృందం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ధనుంజయ నాయుడు నేతృత్వంలో‌ ఆరుగురు సభ్యులతో కూడిన బృందం పరీక్షలు నిర్వహిస్తోంది. బ్యారేజ్లో జియోఫిజికల్, జియోటెక్నికల్, జియో రాడర్ యంత్రం ద్వారా పార్లర్ సెస్మిక్ వేవ్ మెథడ్ ద్వార పరీక్షలను నిపుణులు నిర్వహిస్తున్నారు.

Kaleswaram Project: అన్నారం సరస్వతీ బ్యారేజ్‌లో నిపుణుల‌ బృందం పరీక్షలు

జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని అన్నారం సరస్వతీ బ్యారేజ్ లో సిడబ్ల్యూపిఆర్ఎస్ నిపుణుల‌ బృందం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ధనుంజయ నాయుడు నేతృత్వంలో‌ ఆరుగురు సభ్యులతో కూడిన బృందం పరీక్షలు నిర్వహిస్తోంది. బ్యారేజ్లో జియోఫిజికల్, జియోటెక్నికల్, జియో రాడర్ యంత్రం ద్వారా పార్లర్ సెస్మిక్ వేవ్ మెథడ్ ద్వార పరీక్షలను నిపుణులు నిర్వహిస్తున్నారు. బ్యారేజ్‌లో సీపేజి లీకేజీల మరమ్మత్తుల నేపథ్యంలో నిపుణుల బృందం పరీక్షలు నిర్వహిస్తోంది. బ్యారేజ్ లో 34, 35 పియర్ డౌన్ స్ట్రీమ్ వెంట్ వద్ద బృందం పరీక్షలు నిర్వహిస్తోంది. సీడబ్ల్యూపీఆర్ఎస్ నిర్వహిస్తున్న పరీక్షలను స్టేట్ డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇంజనీరింగ్ ఉన్నాతాధికారులు పరిశీలన నిర్వహిస్తున్నారు. పది రోజుల పాటు బ్యారేజ్‌లో సీడబ్ల్యూపీఆర్ఎస్ బృందం పరీక్షలు నిర్వహించనుంది.

Updated Date - Jun 22 , 2024 | 09:35 AM