Share News

MLC Kavitha: బోరున ఏడ్చేసిన కవిత..

ABN , Publish Date - Aug 27 , 2024 | 09:23 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన కవిత.. తన కొడుకుని హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటిపర్యంతం అయ్యారు. దాదాపు 5 నెలల తరువాత భర్త, పిల్లలను చూసి ఉద్వేగానికి గురయ్యారు. అనంతరం కేటీఆర్, హరిష్ రావును కలిశారు.

MLC Kavitha: బోరున ఏడ్చేసిన కవిత..
MLC Kavitha

న్యూ ఢిల్లీ, ఆగష్టు 27: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన కవిత.. తన కొడుకుని హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటిపర్యంతం అయ్యారు. దాదాపు 5 నెలల తరువాత భర్త, పిల్లలను చూసి ఉద్వేగానికి గురయ్యారు. అనంతరం కేటీఆర్, హరిష్ రావును కలిశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై దాదాపు 160 రోజులకు పైగా తీహార్ జైల్లో ఉన్న ఆమెకు సుప్రీంకోర్టు మంగళవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ కేసులన్నింటిలోనూ బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం ధర్మాసనం తీర్పునిచ్చింది.

దీంతో ఆమె తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పార్టీ మహిళా నేతలు, ఇతర ముఖ్య నేతలు తీహార్ జైలు వద్దకు వచ్చి ఆమెకు స్వాగతం పలికారు. జైలు నుంచి విడుదలైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో న్యాయమే గెలిచిందన్నారు.

Updated Date - Aug 27 , 2024 | 09:23 PM