Share News

Narayankhed: సెల్‌ఫోన్‌ కోసం తల్లిని కొట్టి చంపిన కొడుకు

ABN , Publish Date - Sep 14 , 2024 | 04:35 AM

సెల్‌ఫోన్‌ కొనేందుకు రూ. 20 వేలు ఇవ్వలేదని తల్లిని కొట్టి చంపేశాడో కొడుకు. ఆపై బంధువుల వద్ద ఆమెది సహజ మరణంగా చిత్రీకరించాడు.

Narayankhed: సెల్‌ఫోన్‌ కోసం తల్లిని కొట్టి చంపిన కొడుకు

  • రూ. 20 వేల కోసం హత్య..

  • ఆపై సాధారణ మరణంగా చిత్రీకరణ

  • అంత్యక్రియలు పూర్తి..

  • బంధువుల ఫిర్యాదుతో మృతదేహాన్ని వెలికితీయించిన పోలీసులు

నారాయణఖేడ్‌, సెప్టెంబరు 13: సెల్‌ఫోన్‌ కొనేందుకు రూ. 20 వేలు ఇవ్వలేదని తల్లిని కొట్టి చంపేశాడో కొడుకు. ఆపై బంధువుల వద్ద ఆమెది సహజ మరణంగా చిత్రీకరించాడు. అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు బాగోతం బయటపడింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం తుర్కపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బంటు రాజమ్మ(48), సాయిలు దంపతులకు నర్సింహులు, శ్రీనివా్‌సలు ఇద్దరు కుమారులు. బంటు సాయిలు 20 ఏళ్ల క్రితమే చనిపోయాడు.


చిన్న కుమారుడు శ్రీనివాస్‌ మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడని స్థానికులు తెలిపారు. సెల్‌ఫోన్‌ ఫోన్‌ కొనుగోలుకు రూ.20 వేలు ఇవ్వాలని తల్లిని కోరగా, ఆమె తన దగ్గర అంత డబ్బు లేదని చెప్పింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి తాగిన మైకంలో తల్లితో గొడవ పడిన శ్రీనివాస్‌ ఆమెను కొట్టి, హత్య చేసి సాధారణ మరణంగా చిత్రీకరించాడు. గురువారం బంధువుల సమక్షంలో అంత్యక్రియలు చేశారు. అయితే, ఆ సమయంలో రాజమ్మ శరీరంపై గాయాలు కనిపించడంతో బంధువులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం ఖననం చేసిన రాజమ్మ మృతదేహాన్ని పోలీసులు వెలికితీయించి పోస్టుమార్టం చేశారు.

Updated Date - Sep 14 , 2024 | 04:35 AM