Share News

Jogipet: స్వాతంత్య్ర సమరయోధుడు లింగమయ్యమృతి

ABN , Publish Date - Oct 09 , 2024 | 04:12 AM

మెదక్‌ జిల్లా జోగిపేటకు చెందిన స్వాత్రంత్య సమరయోఽధుడు గడిండ్ల లింగమయ్య గౌడ్‌(93) మృతిచెందారు.

Jogipet: స్వాతంత్య్ర సమరయోధుడు లింగమయ్యమృతి

జోగిపేట, అక్టోబరు 8: మెదక్‌ జిల్లా జోగిపేటకు చెందిన స్వాత్రంత్య సమరయోఽధుడు గడిండ్ల లింగమయ్య గౌడ్‌(93) మృతిచెందారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో రెండు వారాలుగా చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. లింగమయ్య గౌడ్‌ యువకుడిగా ఉన్న సమయంలో రజాకార్ల దురాగతాలను ఎదిరిస్తూ తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొని జైలుపాలయ్యారు. సుమారు 10 నెలలపాటు జైలు శిక్షను అనుభవించారు.


తెలంగాణను భారతదేశంలో విలీనం చేసిన అనంతరం విమోచనోద్యమంలో పాల్గొన్న వారందరినీ కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించి గౌరవించింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతులమీదుగా లింగమయ్యగౌడ్‌ తామ్రపత్ర పురస్కారం పొందారు. కాగా లింగమయ్యగౌడ్‌ అంత్యక్రియలు బుధవారం జోగిపేటలో నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.

Updated Date - Oct 09 , 2024 | 04:12 AM