Share News

BRS: పార్టీ కార్యాలయాల జోలికి వస్తే ఖబడ్దార్..: దాస్యం వినయ్ బాస్కర్

ABN , Publish Date - Jul 04 , 2024 | 12:08 PM

హనుమకొండ: బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ బాస్కర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ విపక్షంపపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన హనుమకొండలో మీడియాతో మాట్లాడుతూ..

BRS: పార్టీ కార్యాలయాల జోలికి వస్తే ఖబడ్దార్..: దాస్యం వినయ్ బాస్కర్

హనుమకొండ: బీఆర్ఎస్ (BRS) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ బాస్కర్ (Dasyaam Vinay Baskar) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.)పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ విపక్షంపపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన హనుమకొండలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు చెప్పుకునేందుకు బాధితులు బీఆర్ఎస్ కార్యాలయాలకు వస్తున్నారని.. అది చూసి కాంగ్రెస్ ఓర్వలేక... పార్టీ కార్యాలయాలను కూల్చివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని నిబంధనల ప్రకారం మేము పార్టీకి కేటాయించామని చెప్పారు.


వరంగల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా పార్క్ స్థలంలోనే కట్టారని, ఇక్కడి ఎమ్మెల్యే తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, తనపై కూడా అక్రమ కేసు పెట్టాలని చూస్తున్నారని దాస్యం వినయ్ బాస్కర్ అన్నారు. పార్టీ కార్యాలయాల జోలికి వస్తే ఖబడ్దార్.. అంటూ హెచ్చరించారు. తమకిచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చానని, హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రజలే కాపాడుకుంటారని, న్యాయపోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతిపై శ్వేతపత్రం విడుదల (ఫోటో గ్యాలరీ)

ఆకాశమే హద్దుగా.. అమరావతి: సీఎం చంద్రబాబు

మోదీతో టీ20 వరల్డ్ కప్ విజేతల భేటీ నేడు..

రాజమండ్రిలో ఎలక్షన్‌ హీట్‌..!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 04 , 2024 | 12:08 PM