ఆధారాలతో అడ్డంగా బుక్కైన జగన్..

ABN, Publish Date - Nov 24 , 2024 | 09:03 AM

అదానీ ముడుపుల కేసు వ్యవహారంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా అడ్డంగా బుక్కయ్యారు. దీంతో ఏపీ ప్రభుత్వం న్యాయనిపుణులతో చర్చించి చర్యలకు సిద్ధమవుతోంది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

అదానీ ముడుపుల వ్యవహారంలో వైఎస్ జగన్ అడ్డంగా బుక్కయ్యారా.. ఆధారాలను ఎఫ్‌బీఐ సేకరించిందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. దీంతో ఏపీ ప్రభుత్వం న్యాయనిపుణులతో చర్చించి చర్యలకు సిద్ధమవుతోంది. సోలార్ విద్యుత్ వ్యవహారంలో అదానీ, జగన్ ముడుపుల వ్యవహారం దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అదానీ కుదుర్చుకున్న ఒప్పందంలో రేటు ఎక్కువగా ఉండడంతో కొనుగోలుచేసేందుకు ఏ రాష్ట్రం ఆసక్తి చూపించలేదు. సెకీ ఒప్పందాన్ని చూపించి విదేశీ సంస్థల నుంచి రూ. 25 వేల కోట్ల రుణం తీసుకున్న అదానీ గ్రూప్ తమ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అమెరికాలోని ఫండింగ్ ఏజెన్సీలు ఆరోపించాయి.


ఈ నేపథ్యంలో అదానీ అప్పటి ఏపీ సీఎం జగన్‌తో సంప్రదింపులు జరిపి యూనిట్‌ను రూ. 2.40 పైసలకు కొనుగోలు చేశారు. అదానీకి గుజరాత్‌లో ఉన్న సౌర విద్యుత్ ప్రాజెక్టు నుంచి విద్యుత్‌ను ఏపీకి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గుజరాత్ నుంచి విద్యుత్ సరఫరా చేస్తే ట్రాన్స్‌మిషన్ చార్జీలతోపాటు. వీనింగ్ చార్జీలు కూడా కలుపుకుని సుమారు యూనిట్ రూ. 4.50 పడుతుందని అప్పట్లోనే టీడీపీ పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. కేశవ్ చేసిన ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ పెదవి విప్పలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

హోటల్స్, లాడ్జీలు, మెన్ హాస్టళ్లపై పోలీసుల తనిఖీలు..

సోషల్ మీడియా సైకోలపై ఉక్కుపాదం

జగన్‌ను బయట ఉంచి తప్పు చేస్తున్నారు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 24 , 2024 | 09:03 AM