బాసరలో ముదురుతున్న బీజాక్షరాల వివాదం..

ABN, Publish Date - Jul 10 , 2024 | 07:05 AM

నిర్మల్: జిల్లాలోని ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి దేవి క్షేత్రం బాసరలో బీజాక్షరాల వివాదం ముదురుతోంది. అక్షరాభ్యసం కోసం వచ్చే చిన్నారుల నాలుకలపై స్థానిక ప్రైవేటు వేద పాఠశాలలో బీజాక్షరాలు రాస్తుండడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

నిర్మల్: జిల్లాలోని ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి దేవి క్షేత్రం బాసరలో బీజాక్షరాల వివాదం ముదురుతోంది. అక్షరాభ్యసం కోసం వచ్చే చిన్నారుల నాలుకలపై స్థానిక ప్రైవేటు వేద పాఠశాలలో బీజాక్షరాలు రాస్తుండడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని ఖండిస్తూ బుధవారం బాసరలో ఆందోళనకు జ్ఞాన సరస్వతి అనుష్టాన పరిషత్ పిలుపిచ్చింది. బాసరలో కొన్నేళ్లుగా ప్రైవేటు వేద పాఠశాల కొనసాగుతోంది. ఇక్కడ చాలామందికి కులాలకు అతీతంగా వేదాలు నేర్పుతున్నారు. గోదావరి మహా హారతిని సయితం నిర్వహిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొన్నాళ్లుగా ఇక్కడ సరికొత్త పూజా కార్యక్రమం మొదలైంది. అమ్మవారి ఆలయానికి అక్షరాభ్యాసం కోసం వచ్చే చిన్నారుల నాలుకపై నిర్వాహకులు బీజాక్షరాలు రాస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం

అలాంటి వారిని నడిరోడ్డుపై నరకాలి!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 10 , 2024 | 07:05 AM