16 మంది ఏపీ ఐపీఎస్‌లకు డీజీపీ షాక్..

ABN, Publish Date - Aug 15 , 2024 | 09:52 AM

అమరావతి: వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారు. టీడీపీ నాయకులపై అడ్డగోలుగా కేసులు పెట్టి వేధించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే అడ్డంగా బుక్కయ్యారు. పోస్టులు లేకుండా వెయిటింగ్‌లో ఉన్నారు. ఇంత జరిగినా కొందరు ఐపీఎస్‌ల బుద్ది మారలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమావేశాలు పెట్టారు.

అమరావతి: వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారు. టీడీపీ నాయకులపై అడ్డగోలుగా కేసులు పెట్టి వేధించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే అడ్డంగా బుక్కయ్యారు. పోస్టులు లేకుండా వెయిటింగ్‌లో ఉన్నారు. ఇంత జరిగినా కొందరు ఐపీఎస్‌ల బుద్ది మారలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమావేశాలు పెట్టారు. ఎలాగూ పని లేదుకదా అనుకంటూ ఎక్కడపడితే అక్కడ తిరిగారు. దాంతో 16 మంది సీనియర్ ఐపీఎస్‌లకు ఏపీ డీజీపీ షాక్ ఇచ్చారు.


వెయిటింగ్ పీరియడ్‌లో హెడ్ క్వార్టర్ వదిలి హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్లడంతోపాటు రహస్య సమావేశాలు పెట్టినట్లు ప్రభుత్వం భావిస్తోంది. దీంతో వారిపై చర్యలు తీసుకుంటూ డీజీపీ ద్వారకా తిరుమలరావు మెమొ జారీ చేశారు. ఇకపై ఉదయం 10 గంటలకు డీజీపీ ఆఫీసుకు వచ్చి.. సాయంత్రం పని గంటలు ముగిసే వరకు వేచి ఉండాలని తేల్చి చెప్పారు. అలాగే అటెండెన్స్ రిజిష్టర్‌లో ఉదయం, సాయంత్రం రెండు సార్లు సంతకాలు చేయాలని డీజీపీ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రెండోసారి కంటతడి కంటతడి పెట్టుకున్న మంత్రి

టీటీడీలో 58 మంది ఉద్యోగులకు నోటీసులు

కన్నతండ్రే కాలయముడు

మహిళలకు... అదే అసలైన స్వాతంత్య్రం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 15 , 2024 | 09:52 AM