రెండోసారి కంటతడి కంటతడి పెట్టుకున్న మంత్రి

ABN, Publish Date - Aug 15 , 2024 | 09:12 AM

ఖమ్మం: తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు. నాటి ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, చంద్రబాబు, కేసీఆర్ కేబినెట్‌లో పనిచేయడంతోపాటు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలోనూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఖమ్మం: తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు. నాటి ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, చంద్రబాబు, కేసీఆర్ కేబినెట్‌లో పనిచేయడంతోపాటు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలోనూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నేతగా గుర్తింపు పొందారు. ఎంతో గాంభీర్యంగా, హుందాగా ఉండే తుమ్మల.. ఇటీవల భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.


సీతారామ ప్రాజెక్టుల పంప్ హౌస్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఈ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్‌తో మంత్రి తుమ్మల నొచ్చుకున్నారు. బీఆర్ఎస్ సర్కార్ నిర్మించిన సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందన్న హరీష్ రావు విమర్శలు మంత్రి తుమ్మల కంటతడికి కారణమయ్యాయి. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో రెండోసారి ఆయన కంటతడి పెట్టుకున్నారు. 2014 ఆగస్టు 30న టీడీపీకి రాజీనామా చేసినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు మొదటిసారి భావోద్వేగానికి గురయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టీటీడీలో 58 మంది ఉద్యోగులకు నోటీసులు

కన్నతండ్రే కాలయముడు

మహిళలకు... అదే అసలైన స్వాతంత్య్రం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 15 , 2024 | 09:12 AM