హైడ్రాను అడ్డుకున్న మూసీ నివాసితులు..

ABN, Publish Date - Sep 27 , 2024 | 09:01 AM

హైదరాబాద్: మూసీ నదీగర్భం (రివర్‌ బెడ్‌) పరిధిలోని నిర్మాణాలకు మార్కింగ్‌ చేసే ప్రక్రియ ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ, ఇరిగేషన్‌, సర్వే విభాగానికి చెందిన అధికారులు ఈ సర్వే చేపట్టారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

హైదరాబాద్: మూసీ నదీగర్భం (రివర్‌ బెడ్‌) పరిధిలోని నిర్మాణాలకు మార్కింగ్‌ చేసే ప్రక్రియ ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ, ఇరిగేషన్‌, సర్వే విభాగానికి చెందిన అధికారులు ఈ సర్వే చేపట్టారు. మూసీ రివర్‌ బెడ్‌లో ఉన్న ఇళ్లు, వాటి యాజమానుల వివరాలు నమోదు చేసేందుకు వచ్చిన అధికారులను పలు ప్రాంతాల్లో నివాసితులు అడ్డుకున్నారు.


చైతన్యపురి ఫణిగిరి కాలనీ, వెంకటసాయినగర్‌ కాలనీ, న్యూ మారుతీ నగర్‌, సత్య నగర్‌లో అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో సర్వే చేయనివ్వబోమన్నారు. ‘సీఎం డౌన్‌ డౌన్‌’ అని నినాదాలు చేశారు. రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న పత్రాలను లాక్కొని చించివేశారు. మార్కింగ్‌ చేసేందుకు ఉపయోగించే ఎరుపురంగును ఓ యువకుడు సిబ్బంది చేతిలోంచి లాక్కుని దూరంగా విసిరేశాడు. దీంతో ఈ ప్రాంతాల్లో 235 ఇళ్లకు మార్కింగ్‌ చేయాలని వచ్చిన అధికారులు 10 ఇళ్లకు మాత్రమే మార్కింగ్‌ చేసి వెనుతిరిగారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కడియపులంక నర్సరీల్లో సంచరిస్తున్న చిరుత

ఎమ్మెల్సీ కవిత మళ్లీ రాజకీయాలపై ఫోకస్..

APMDC మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్ట్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 27 , 2024 | 11:07 AM

News Hub