Share News

KTR: బీఆర్ఎస్- కాంగ్రెస్ నేతల పోటాపోటీ నినాదాలు

ABN , Publish Date - Aug 24 , 2024 | 12:13 PM

మహిళా కమిషన్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి సీతక్క- కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని కేటీఆర్ ప్రకటన చేశారు.

KTR: బీఆర్ఎస్- కాంగ్రెస్ నేతల పోటాపోటీ నినాదాలు
KTR

మహిళా కమిషన్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి సీతక్క- కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని కేటీఆర్ ప్రకటన చేశారు. అయినప్పటికీ కమిషన్ నోటీసులు జారీచేయడంతో ఈ రోజు విచారణకు హాజరయ్యారు. అంతకుముందు మహిళా కమిషన్ భవనం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహిళా కమిషన్ భవనం గేటు లోపలికి చొచ్చుకొచ్చేందుకు కాంగ్రెస్- బీఆర్ఎస్ మహిళా నేతలు ప్రయత్నించారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అని బీఆర్ఎస్ మహిళ నేతలు నినాదాలు చేయగా.. కేటీఆర్ డౌన్ డౌన్ అని కాంగ్రెస్ మహిళా నేతల నినాదాలు చేశారు.

Updated Date - Aug 24 , 2024 | 12:22 PM