encroachments ఆక్రమణల తొలగింపు
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:20 AM
ముదిగుబ్బ నుంచి కోడూరు వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 342 నిర్మాణం కోసం బుక్కప ట్నం మండలంలోని జానకంపల్లి వద్ద ఆక్రమణలను అధికారులు బుధవారం తొలగించారు.

బుక్కపట్నం, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): ముదిగుబ్బ నుంచి కోడూరు వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 342 నిర్మాణం కోసం బుక్కప ట్నం మండలంలోని జానకంపల్లి వద్ద ఆక్రమణలను అధికారులు బుధవారం తొలగించారు. తహసీల్దార్ షబుద్దీన పోలీస్ బందోబస్తు వద్ద ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఆక్రమణలను తొలగించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం పూర్తికాగా, ఆక్రమణలు ఒక్కటే అడ్డుగా ఉండేది. దీంతో అధికారులు ఆ అక్రమ నిర్మాణాలు తొలగించి, రోడ్డు నిర్మాణం పూర్తి చేయడానికి సిద్ధం చేశారు.