గ్రామాల పరిశుభ్రతే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:48 PM
చెత్త రహిత, ఆరోగ్య గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామ పంచాయతీలలో చెత్త సేకరించేందుకు మంజూరైన 18 ట్రాక్టర్లను స్వామి గురువారం సాయంత్రం కొండపి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అందజేశారు.

మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి
కొండపి మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు చెత్త సేకరణ ట్రాక్టర్లు అప్పగింత
కొండపి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : చెత్త రహిత, ఆరోగ్య గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామ పంచాయతీలలో చెత్త సేకరించేందుకు మంజూరైన 18 ట్రాక్టర్లను స్వామి గురువారం సాయంత్రం కొండపి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య పనుల పూర్తి బాధ్యతను సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి తీసుకోవాలన్నారు. చెత్త రహిత గ్రామాలుగా మండలాన్ని తీర్చిదిద్దాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీపీవో జి.వెంకటనాయుడు, ట్రాక్టర్లు మంజూరైన గ్రామాల సర్పంచ్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.