YS Sharmila: డీకే శివకుమార్తో షర్మిల భేటీ
ABN , Publish Date - Mar 29 , 2025 | 05:09 AM
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించారు.

అమరావతి, బెంగళూరు, మార్చి 28(ఆంధ్రజ్యోతి): కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. కర్ణాటకలోని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు పార్టీ జిల్లా అధ్యక్షులతో కలసి డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న షర్మిల ఆయనను కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులపై డీకేకు వివరించిన ఆమె... కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన కార్యాచరణ గురించి చర్చించారు. శివకుమార్తో సమావేశంపై ఆమె ఎక్స్లో ట్వీట్ చేశారు.
Also Read:
42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..
మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు
కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..
For More Andhra Pradesh News and Telugu News..