PM Kisan: పీఎం కిసాన్తో ఏపీలో 41 లక్షల మందికి లబ్ధి
ABN , Publish Date - Mar 26 , 2025 | 04:53 AM
పీఎం కిసాన్ 19వ విడత కింద ఆంధ్రప్రదేశ్కు రూ.854.28 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ తెలిపారు. దీని ద్వారా 41,27,619 మంది రైతులకు లబ్ధి కలుగుతుంది.

న్యూఢిల్లీ, మార్చి 25(ఆంధ్రజ్యోతి): పీఎం కిసాన్ కింద 19వ విడత (2024 డిసెంబరు-మార్చి 2025) నిధుల విడుదలలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు రూ.854.28 కోట్లు ఇచ్చామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ చెప్పారు. దీనివల్ల ఏపీలో 41,27,619 మంది రైతులు లబ్ధి పొందారని వివరించారు. లోక్సభలో ఎంపీ బెన్నీ బెహనన్ మంగళవారం అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే
Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్
Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ