Share News

Petrol Price: వాహనదారులకు అదిరిపోయే న్యూస్.. వెంటనే పెట్రోల్ బంకులకు పరుగులు పెట్టండి

ABN , Publish Date - Apr 07 , 2025 | 03:39 PM

ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ వాహనదారులపై పడిందా. పెట్రో ఉత్పత్తుల పెరుగుదలకు కారణం అదేనా. కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌‌పై రూ.2 ఎక్పైజ్ సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ అర్థరాత్రి నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి.

Petrol Price: వాహనదారులకు అదిరిపోయే న్యూస్.. వెంటనే పెట్రోల్ బంకులకు పరుగులు పెట్టండి
Petrol, Disel Rates

వాహనదారులకు ఊహించని షాక్ తగిలింది. భారత ప్రభుత్వం డీజిల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2 పెంచింది. ప్రపంచ చమురు ధరలలో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు, ట్రంప్ సుంకాల మధ్య ప్రభుత్వం సోమవారం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2017 నుంచి భారత్‌లో డైనమిక్ ప్రైసింగ్ విధానం అమలవుతుంది. అంటే ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరలలో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ పెద్దగా తేడా ఉండదు. పైసల్లోనే హెచ్చు, తగ్గులుండేవి. 2017 సెప్టెంబర్‌లో కేంద్రప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.2.16, డీజిల్‌పై రూ.2.02 పెంచింది. ఆ తర్వాత నుంచి డైనమిక్ ప్రైసింగ్ అందుబాటులో ఉంది.


ప్రస్తుతం ధరలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.109 నుంచి రూ.110 మధ్య ఉండగా జిల్లాను బట్టి పైసల్లో తేడా ఉంటుంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఈ ధరలపై రూ.2 ఎక్సైజ్ సుంకం పెరగనుంది. అంటే పెట్రోల్ ధర రూ.111 నుంచి రూ.112 కానుంది. డీజిల్ ధర రూ.97.44 ఉండగా 99.44కు పెరగనుంది. రాష్ట్రాలను బట్టి పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పాండిచ్చెరిలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రూ.1 నుంచి రూ.2 వరకు తక్కువ ఉండే అవకాశం ఉంది.


ఒకసారి తగ్గించి

పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా ఉన్నాయని ప్రజల నుంచి విమర్శలు రావడంతో కేంద్రప్రభుత్వం 2021 నవంబర్ 4వ తేదీన కేంద్రప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అలాగే రాష్ట్రప్రభుత్వాలు విధించే వ్యాట్‌ను తగ్గించాలని పిలుపునిచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాష్ట్రప్రభుత్వాలు విధించే వ్యాట్‌ను తగ్గించగా, కొన్ని రాష్ట్రాలు తమ ఆదాయం తగ్గుతుందనే ఉద్దేశంతో వ్యాట్‌ను తగ్గించలేదు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం తన ఆదాయ వనరులను పెంచుకోవడం కోసం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచినట్లు తెలుస్తోంది.


కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం ఇంధన ధరలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉంది. ఇప్పటివరకు పెట్రోల్‌పై కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం రూ.11 కాగా, పెంచిన రూ.2తో ఎక్సైజ్ సుంకం రూ.13కు పెరగనుంది. డీజిల్‌పై రూ.8 ఉండగా తాజా పెంపుతో రూ.10కు చేరనుంది. మరోవైపు కేంద్రం పెట్రో, డీజిల్ ధరలు పెంచిందనే ప్రచారం జరిగిన కొద్దిసేపటికే కేంద్రం స్పందించింది. ఈ పెంపును ఆయిల్ కంపెనీలు భరిస్తాయని తెలిపింది. ప్రత్యక్షంగా వాహనదారుడిపై ఎలాంటి ప్రభావం చూపించదని స్పష్టంచేసింది. వాహనాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుత ధరలకే వాహనదారులకు పెట్రోల్, డీజిల్ లభిస్తుందని తెలిపింది.

ఇవి కూడా చదవండి..

శంకరయ్య హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులు..

నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు బంద్

తగ్గుతున్న బంగారం ధరలు..

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Apr 07 , 2025 | 05:03 PM