US India trade: అమెరికా వాణిజ్య ప్రతినిధి భారత పర్యటన నేటి నుంచి
ABN , Publish Date - Mar 25 , 2025 | 03:33 AM
అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ ఈ రోజు నుంచి భారత్లో పర్యటించనున్నారు. అమెరికా ప్రతీకార సుంకాలపై చర్చలు జరిపేందుకు భారత వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్తో సమావేశం అవ్వనున్నారు.

న్యూఢిల్లీ, మార్చి24: భారత్లో నేటి నుంచి అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ పర్యటించనున్నారు. ఈ నెల 29 వరకు కొనసాగే పర్యటనలో ఆయన భారత వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్తో సమావేశమై చర్చలు జరుపుతారు. ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టుపడుతున్న నేపథ్యంలో లించ్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. పరస్పర సుంకాలపై నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని భారత్ ఆయన్ను కోరే అవకాశముంది. మరోవైపు, వెనెజువెలా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలు తమకు 25ు సుంకాలు చెల్లించాలని ట్రంప్ హెచ్చరించారు. వెనెజువెలా నుంచి గతేడాది భారత్ అత్యధికంగా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
YCP: భయం గుప్పెట్లో.. విశాఖ వైసీపీ
Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్
Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు
Cell Phones: పిల్లలను సెల్ ఫోన్కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..
T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు
For National News And Telugu News