Share News

Iftar: దుబాయిలో రంజాన్ చివరి రోజు ప్రవాసాంధ్రుల ఇఫ్తార్

ABN , Publish Date - Mar 30 , 2025 | 03:21 PM

దుబాయిలోని ప్రవాసాంధ్ర ముస్లిం సంఘమైన జి.యం.సి తెలుగు ప్రవాసీయులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ప్రముఖ హైదరాబాదీ రెస్టారెంటైన షహేరాన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్ర ప్రముఖులు యస్వీ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, సలాఓద్దీన్, అబ్దుల్ ముతల్లీబ్ తదితరులు పాల్గొన్నారు.

Iftar: దుబాయిలో రంజాన్ చివరి రోజు ప్రవాసాంధ్రుల ఇఫ్తార్
Iftar Dubai

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: రంజాన్ చివరి రోజు అయిన శనివారం దుబాయిలోని ప్రవాసాంధ్ర ముస్లిం సంఘమైన జి.యం.సి తెలుగు ప్రవాసీయులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది.

అటు ఉత్తరాంధ్ర నుండి ఇటు రాయలసీమ వరకు తెలుగునాట ప్రతి చోటా మతసామరస్యం నెలకొని ఉందని, ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండే స్వభావం తెలుగువారిలో ఉందని ఈ సందర్భంగా జి.యం.సి ప్రతినిధులు శేఖ్ అబ్దుల్లా, ఫహీం వ్యాఖ్యానించారు.

Doha: తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ కిట్‌ల పంపిణీ


1.jpgఎమిరేట్‌లో ప్రముఖ హైదరాబాదీ రెస్టారెంటైన షహేరాన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్ర ప్రముఖులు యస్వీ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, సలాఓద్దీన్, అబ్దుల్ ముతల్లీబ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 30 , 2025 | 03:21 PM