CM Chandrababu: గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
ABN, Publish Date - Apr 15 , 2025 | 08:04 AM
గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గం, పొన్నెకల్లు గ్రామంలో సోమవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ పర్యటనలో ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గం, పొన్నెకల్లు గ్రామంలో సోమవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.

అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

పొన్నెకల్లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో భారీ బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నవీన్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు కాసేపు ముచ్చటించారు.

చిన్నారులతో ముచ్చటిస్తున్న సీఎం చంద్రబాబు

బైక్ మెకానిక్ ప్రవీణ్ షాపును సీఎం చంద్రబాబు పరిశీలించారు.

సీఎం చంద్రబాబుతో ఫొటో దిగుతున్న విద్యార్థులు

చిన్నారిని ఎత్తుకున్న సీఎం చంద్రబాబు

పొన్నెకల్లు గ్రామంలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.

సీఎం చంద్రబాబును గజమాలతో కూటమి నేతలు సన్మానించారు.

పొన్నెకల్లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సీఎం చంద్రబాబు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రజలు, కూటమి నేతలు భారీగా పాల్గొన్నారు.

అంబేద్కర్ చిత్రపటాల ప్రదర్శనను సీఎం చంద్రబాబు తిలకించారు.

ఫొటోలు వీక్షిస్తూ నిర్వాహకులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

స్వయం సహాయక సంఘాల మహిళలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

పీ4 కార్యక్రమాల లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు.

మార్గదర్శులు, బంగారు కుటుంబం లబ్దిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

ఓ షాపు వద్ద ఆగి మహిళతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఆమె తన సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించారు.
Updated at - Apr 15 , 2025 | 08:30 AM