వైభవంగా వెంకటపాలెం శ్రీనివాస కల్యాణ మహోత్సవం
ABN, Publish Date - Mar 16 , 2025 | 07:02 AM
విజయవాడ వెంకటపాలెంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్, టీటీడీ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కల్యాణ మహోత్సవం అమరావతి రాజధానిలో కనులపండువగా జరిగింది.

రాజధాని పరిధి వెంకటపాలెంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో తొలిసారిగా శ్రీనివాసుడి కల్యాణాన్ని శనివారం సాయంత్రం టీటీడీ వైభవోపేతంగా నిర్వహించింది.

కల్యాణ మహోత్సవానికి సీఎం చంద్రబాబు సంప్రదాయబద్ధంగా పట్టు పంచె ధరించి సతీ సమేతంగా హాజరయ్యారు.

అనంతరం అక్కడికి వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్ను సీఎం చంద్రబాబు, మంత్రులు, టీటీడీ సిబ్బంది సాదరంగా ఆహ్వానించారు.

గవర్నర్ను ఆశీర్వదిస్తున్న బ్రాహ్మణులు

ధ్వజస్తంభానికి నమస్కరిస్తున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబుకు తిరునామధారణ చేస్తున్న బ్రాహ్మణులు

అన్నమయ్య సంకీర్తనలు, వేద మంత్రోచ్ఛరణలతో రాజధాని ఆధ్యాత్మిక నగరిని తలపించింది.

అధికారులు ప్రకటించిన షెడ్యూల్ కంటే 17నిమిషాలు ముందుగానే, సాయంత్రం 5:43 గంటలకే వెంకటపాలెంలోని ఆలయానికి వెళ్లి స్వామివారిని సీఎం చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు.

అనంతరం శ్రీవారి ఆలయం నుంచి మంగళవాయిద్యాల నడుమ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు పట్టువస్త్రాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు.

ధ్వజస్తంభానికి నమస్కరిస్తున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

సీఎం చంద్రబాబుకు వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం అందజేస్తున్న టీటీడీ అధికారులు

వేదికను వివిధ పుష్పాలతో అలంకరించారు. 4 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 30వేల కట్ ఫ్లవర్స్తో అందంగా తీర్చిదిద్దారు. వేదికను చూసి భక్తులు ముగ్ధులయ్యారు.

తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం నిర్వహించారు.

ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు దంపతులు

ప్రత్యేక పూజలు చేస్తున్న సీఎం చంద్రబాబు దంపతులు

సీఎం చంద్రబాబు దంపతులను ఆశీర్వదిస్తున్న బ్రాహ్మణులు

శ్రీనివాస కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులు

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు స్వామివారి చిత్రపటం అందజేస్తున్న టీటీడీ అధికారులు

స్వామివారి కల్యాణంలో భాగంగా పూజలు చేస్తున్న బ్రాహ్మణులు

కార్యక్రమంలో భాగంగా యజ్ఞం చేస్తున్న బ్రాహ్మణులు

సీఎం చంద్రబాబు దంపతులకు హారతి ఇస్తున్న బ్రాహ్మణులు

కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మంత్రి కొల్లు రవీంద్ర, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

కల్యాణంలో భాగంగా మంగళ సూత్రాలను చూపిస్తున్న బ్రాహ్మణులు

ప్రత్యేక అలంకరణలో స్వామివారు

బ్రాహ్మణులకు నమస్కరిస్తున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు

కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన జీయర్ స్వామి, అహోబిల మఠాధిపతి రామానుజ జీయర్ స్వామి, శివస్వామి తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మంత్రి నారాయణ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.

స్వామివారికి హారతి ఇస్తున్న బ్రాహ్మణులు

మంగళ సూత్రాలను భక్తులకు చూపిస్తున్న బ్రాహ్మణులు

స్వామివారికి పూజలు చేస్తున్న బ్రాహ్మణులు

శ్రీవారి లడ్డును సీఎం చంద్రబాబుకు అందజేస్తున్న టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
Updated at - Mar 16 , 2025 | 08:08 AM