IPL 2025, GT vs MI: చెలరేగిన సాయి సుదర్శన్.. ముంబై టార్గెట్ ఎంతంటే
ABN , Publish Date - Mar 29 , 2025 | 09:26 PM
శుభ్మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్తో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ జట్లు ఈ సీజన్లో తొలి విజయం తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ టీమ్ మొదట బ్యాటింగ్కు దిగింది.

అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ (IPL 2025) మ్యాచ్లో గుజరాత్ బ్యాటర్లు చెలరేగారు. సాయి సుదర్శన్ వరుసగా రెండో హాఫ్ సెంచరీ చేశాడు. శుభ్మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్తో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ జట్లు ఈ సీజన్లో తొలి విజయం తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ టీమ్ మొదట బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.
గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్ (40 బంతుల్లో 63), శుభ్మన్ గిల్ (27 బంతుల్లో 38) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ చూడ చక్కని షాట్లతో ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. అయితే మంచి ఆరంభాన్ని శుభ్మన్ గిల్ మరోసారి భారీ స్కోరుగా మలచలేకపోయాడు. మరోవైపు సాయి సుదర్శన్ మాత్రం తన ఫామ్ను కొనసాగించాడు. వరుసగా రెండో మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన జాస్ బట్లర్ (24 బంతుల్లో 39) రాణించాడు. షారూక్ ఖాన్ (9) విఫలమయ్యాడు. తెవాటియా (0) రనౌట్ అయి వెనుదిరిగాడు. చివర్లో రూధర్ఫర్డ్ (18) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యాడు. స్లాగ్ ఓవర్స్లో పరుగులు రాబట్టడంలో గుజరాత్ బ్యాటర్లు విఫలమయ్యారు.
ముంబై బౌలర్లు చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్, చాహర్, ముజ్బిర్ రెహ్మాన్, సత్యనారాయణ రాజు ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ పిచ్ మీద 196 పరుగులు అంటే పెద్ద స్కోరు అనే చెప్పాలి. అయితే తొలి ఇన్నింగ్స్ కంటే రెండు ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం సులభం. మంచు ప్రభావం కారణంగా బౌలర్లకు గ్రిప్ దొరకదు. ఈ నేపథ్యంలో ముంబై బ్యాటర్లను గుజరాత్ బౌలర్లు ఎలా కట్టడి చేస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి..
Virat Kohli: ధోనీ ముందే సీఎస్కే బౌలర్కు వార్నింగ్.. విరాట్ కోహ్లీ ఎలా సీరియస్ అయ్యాడో చూడండి..
మ్యాచ్ పోయినా రికార్డు మిగిలింది
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..