టెన్త్ విద్యార్థులకు.. రేపు కెరీర్ గైడెన్స్
ABN , Publish Date - Apr 03 , 2025 | 06:04 AM
వార్షిక పరీక్షలు రాసిన పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 4న కెరీర్ గైడెన్స్ పేర ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని పాఠశాల విద్య సంచాలకులు ఈవీ నర్సింహారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

వార్షిక పరీక్షలు రాసిన పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 4న కెరీర్ గైడెన్స్ పేర ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని పాఠశాల విద్య సంచాలకులు ఈవీ నర్సింహారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి 12.10 గంటల వరకు టీ-శాట్ ద్వారా ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, కోర్సుల వివరాలు తెలిపే విషయ నిపుణులు, తాను పాల్గొంటామని వివరించారు.