Share News

ఐకేపీ వీవోఏలపై ప్రభుత్వ నిర్బంధం ఆపాలి

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:36 PM

: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమ లు చేయాలని ఉద్యమి స్తున్న ఐకేపీ వీఏవోలపై రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తున్న నిర్బంధాల ను ఆపాలని ఐకేపీ వీవోఏల సంఘం రాష్ట్ర అ ధ్యక్షుడు రాజ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

ఐకేపీ వీవోఏలపై ప్రభుత్వ నిర్బంధం ఆపాలి
రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సీఐటీయూ నాయకులు, ఐకేపీ వీవోఏలుల

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, మార్చి 26 (ఆంధ్రజ్యో తి) : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమ లు చేయాలని ఉద్యమి స్తున్న ఐకేపీ వీఏవోలపై రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తున్న నిర్బంధాల ను ఆపాలని ఐకేపీ వీవోఏల సంఘం రాష్ట్ర అ ధ్యక్షుడు రాజ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. బుధ వారం జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యం లో ఐకేపీ వీఏవోలు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ను దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అ ధ్యక్షుడు రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సందర్భంగా ఐకేపీ వీఏవోల ఇ చ్చిన హామీలను అమలు చేయాలని చలో హై దరాబాదుకు పిలుపునిస్తే ప్రభుత్వం వారిని ఎక్కడి కక్కడ పోలీసులతో నిర్బంధించిందని ఆ రోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందిం చి ఐకేపీ వీఏవోల కనీస వేతనం రూ.20 వేలు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డి మాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జి ల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీనివాస్‌, ఉపాధ్యక్షు డు వర్థం పర్వతాలు, సహాయ కార్యదర్శి రామ య్య, ఐకేపీ వీఏవోల సంఘం నాయకులు వెం కటయ్య, మల్లేష్‌, సునీత, శశిరేఖ పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 11:36 PM