Kishan Reddy: అవినీతికి పెద్దపీట వేశారు.. సీఎం రేవంత్పై కిషన్రెడ్డి ఫైర్
ABN , Publish Date - Feb 21 , 2025 | 02:52 PM
Kishan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అన్నివర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆరోపించారు. రేవంత్ ఇచ్చిన ఏ ఒక్క హామీని ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. మిగిలిన యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి రేవంత్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని కిషన్రెడ్డి మండిపడ్డారు.

మెదక్ జిల్లా: తెలంగాణను కేసీఆర్ (KCR) కుటుంబమంతా దోచుకుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా చేసుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మార్పు తెస్తామని చెప్పి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అధికారంలోకి వచ్చారని కానీ ఆచరణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి.. ప్రకటనలు ఫస్ట్ పేజీల్లో ఉన్నాయి.. పనులు మాత్రం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. మంత్రుల్లో సఖ్యత లేదని చెప్పారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు రానుందని జోస్యం చెప్పారు. ఇవాళ( శుక్రవారం) మెదక్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కిషన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మాత్రమే అన్ని స్థానాలకు పోటీచేస్తుందని స్పష్టం చేశారు.
ఆర్థిక పరిస్థితి దివాళా..
తెలంగాణ భవిష్యత్కు ఎమ్మెల్సీ ఎన్నికలు దిశానిర్దేశం చేసేవని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అన్నివర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆరోపించారు. రేవంత్ ఇచ్చిన ఏ ఒక్క హామీని ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. మిగిలిన యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి రేవంత్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని మండిపడ్డారు. ప్రతి దళిత కుటుంబానికి రూ 12లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచారని మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐదు డీఏలపై రేవంత్ ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు.
డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి..
రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పోయి రేవంత్ వచ్చిన కూడా ప్రజల బతుకులు మారడం లేదని చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్నచోట అభివృద్ధి వేగంగా జరుగుతోందని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అవినీతికి పెద్దపీట వేశారని ఆరోపించారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో మంచి పాలన జరుగుతుందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో మంచి పాలన రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అన్ని వర్గాల సమస్యలపై ఉద్యమిస్తామని కిషన్రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Scandal Exposed: భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య..
BJP: సికింద్రాబాద్లో బీజేపీ శ్రేణుల సంబురాలు..
Water Shortage: పట్టణాల్లో నీటికి కటకట
Read Latest Telangana News and Telugu News