Share News

సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Mar 24 , 2025 | 11:16 PM

ఈ వారం కలెక్టరేట్‌ ప్రజావాణికి మొత్తం 27 ఫిర్యాదులు వచ్చాయి. వివిధ సమస్యలపై ప్రజల నుంచి అందిన వినతులను జిల్లా రెవె న్యూ అదనపు కలెక్టర్‌ అమరేందర్‌ స్వీ కరించి పరిశీలన అనంతరం విచార ణ కోసం సంబంధిత అధికారులకు బది లీ చేశారు.

 సమస్యలు పరిష్కరించాలి
ఫిర్యాదులను స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌ అమరేందర్‌

- కలెక్టరేట్‌ ప్రజావాణికి 27 వినతులు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : ఈ వారం కలెక్టరేట్‌ ప్రజావాణికి మొత్తం 27 ఫిర్యాదులు వచ్చాయి. వివిధ సమస్యలపై ప్రజల నుంచి అందిన వినతులను జిల్లా రెవె న్యూ అదనపు కలెక్టర్‌ అమరేందర్‌ స్వీ కరించి పరిశీలన అనంతరం విచార ణ కోసం సంబంధిత అధికారులకు బది లీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా స్థాయి సమస్యలను తక్షణ మే పరిష్కరించడంతో పాటు క్షేత్ర స్థాయి సమ స్యలను విచారణ కోసం సంబంధిత మండలా లకు పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ పరి పాలనాధికారి చంద్రశేఖర్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

త్వరితగతిన పరిష్కరించాలి : ఏఎస్పీ

నాగర్‌కర్నూల్‌ క్రైం : పోలీస్‌ ప్రజావాణికి ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అడిషనల్‌ ఎస్పీ సీహెచ్‌. రా మేశ్వర్‌ అన్నారు. సోమవారం నిర్వహించిన పో లీస్‌ ప్రజావాణికి తగున్యాయం గురించి 6, భూ మి పంచాయితీలు 4, భార్యాభర్తల గొడవలు 1 మొత్తం 11ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన తెలి పారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ఫి ర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలు అడి గి తెలుసుకుని సంబంధిత అధికారులకు ఫిర్యా దుల సమస్యలను పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.

Updated Date - Mar 24 , 2025 | 11:16 PM