అమరావతిలో సింగపూర్ బృందం

ABN, Publish Date - Apr 02 , 2025 | 03:06 PM

Singapore Delegation: అమరావతిలో సింగపూర్ ప్రతినిధుల బృందం పర్యటిస్తోంది. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో సింగపూర్ బృందం సమావేశం కానుంది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

అమరావతి, ఏప్రిల్ 2: ఏపీ రాజధాని అమరావతిలో (Amaravati) సింగపూర్ బృందం (Singapore Delegation ) పర్యటిస్తోంది. స్టార్ట్‌అప్‌ ఏరియా నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కోరుతోంది. ఈ మేరకు సింగపూర్ ప్రతినిధి బృందం రాజధానిలో పర్యటిస్తోంది. కోర్ క్యాపిటల్‌లో వివిధ నిర్మాణాలను బృందం పరిశీలిస్తోంది. అనంతరం సీఎస్‌తో పాటు ఉన్నతాధికారులతో ప్రతినిధి బృందం భేటీ కానుంది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో సమావేశం కానుంది సింగపూర్ బృందం. గతంలో రాజధాని అమరావతిలో సింగపూర్ స్టార్ట్అప్ ఏరియా డెవలప్ చేయడానికి సింగపూర్ కన్సార్టియం 1900 ఎకరాల భూమిని తీసుకుంది.


తాజాగా 5 ఏళ్ల తర్వాత మారిన పరిస్థితులు, ఫ్లడ్ కంట్రోల్‌కు తీసుకుంటున్న చర్యలు, కరకట్ట రోడ్డు, ఉద్దండరాయుని పాలెం - తాళ్లాయపాలెంలోని స్టార్ట్ అప్ ఏరియా, అఖిలభారత సర్వీస్ అధికారుల టవర్స్, మంత్రుల నివాస సముదాయాలను సింగపూర్ ప్రతినిధి బృందం పరిశీలిస్తోంది.


ఇవి కూడా చదవండి

Ameenpur Case Twist: అమీన్‌పూర్‌ కేసులో ట్విస్ట్.. బయటపడ్డ కన్నతల్లి బాగోతం

Vijay Kumar ACB Investigation: హైకోర్టు మొట్టికాయలతో ఏసీబీ ముందుకు విజయ్

Read Latest AP News And Telugu News

Updated at - Apr 02 , 2025 | 03:06 PM