Home » Bengaluru News
‘కాంగ్రెస్, జేడీఎస్లో చేరే ప్రసక్తే లేదు.. గౌరవంగా పిలిస్తే బీజేపీలోకి వెళ్తా’నని బీజేపీ నుంచి ఆరేళ్లపాటు సస్పెన్షన్ వేటుకు గురైన బసనగౌడపాటిల్ యత్నాళ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంచి నేత అని అన్నారు.
భార్య మృతిచెందిన మరుసటి రోజే భర్త కూడా మృతిచెందిన విషాద సంఘటన కర్ణాటక రాష్ట్రం రాయచూర్ దగ్గర జరిగింది. ఈ విషాద సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అమరమ్మ అనే మహిళ గత ఆరు నెలలుగా అనారోగ్యంతో మంచానపడి గురువారం రాత్రి కన్నుమూసింది. అతి తెలుసుకున్న భర్త రాజశేఖర్ మానసికంగా కుంగిపోయి శుక్రవారం కన్నుమూశాడు. ఇద్దరి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
మా బండి నిండిపోయింది.. ఆ ఎమ్మెల్యేలను ఏం చేసుకోవాలి అంటూ.. మంత్రి సతీశ్జార్కిహొళి పేర్కొనడం ఇప్పుడు తీవ్ర చర్చానీయాంశమైంది. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై మంత్రి ఇప్పుడు ఇలా మాట్లాడడం కన్నడ రాజకీయాల్లో చర్చకు దారితీసింది.
నా హత్యకు కుట్ర.. సుపారీ ఇచ్చి చంపించాలని చూస్తున్నారని మంత్రి రాజణ్ణ కుమారుడు ఎమ్మెల్సీ రాజేంద్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
సంచలనం కలిగించిన మైసూరు అర్బన్ డవలప్మెంట్(ముడా) స్కాంపై మైసూరు నగరాభివృద్ది ప్రాధికార మాజీ కమిషనర్ డీబి నటేష్ను విచారణ జరిపేలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్లు రద్దుపై హైకోర్టు ఫుల్బెంచ్ను ఆశ్రయించారు. ఈ స్కాంలో దాదాపు రూ. 4500 కోట్లు చేతులు మారాయనే విమర్శలు పెద్దఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే.
దేవుడా.. ఓ మంచి దేవుడా.. నాకు పాస్ మార్కులు వచ్చేలా చూడు సామీ.. అంటూ ఓ విద్యార్థి తన కోరికల చిట్టాను ఓ పేపర్ పై రాసి దాన్ని హుండీలో వేశాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
నా రాజకీయ జీవితంలొ ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు బీఆర్ పాటిల్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాసనసభలో బీజేపీ సభ్యులు సభకు భంగం కలిగించడం దారుణమన్నారు.
మళ్లీ.. చిరుత సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అది ఎప్పుడు దాడి చేస్తుందేమోననే భయంతో అటువైను వెళ్లేందుకు ప్రజలు సాహాసం చేయడం లేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
దేవాలయంలాంటా అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే కోరిన కోరిక ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మద్యంప్రియులకు రెండు బాటిళ్లు ఉచితంగా ఇవ్వండి.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనానికి దారితీశాయి.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆశలపై కేంద్రప్రభుత్వం నీళ్లు చల్లింది. రామనగర జిల్లాను బెంగళూరు దక్షిణగా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం షాక్ ఇచ్చింది.