Home » Gaddar
ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. నేటి ఉదయం 11గంటలకు ఆయన అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. అయితే ఎల్బీ స్టేడియంలో అభిమానుల తాకిడి పెద్దగా కనిపించడం లేదు. కుటుంబ సభ్యులతో పాటు కొద్దీ మంది కళాకారులు మాత్రమే ఎల్బీ స్టేడియంలో కనిపిస్తున్నారు.
ఎల్బీస్టేడియం నుంచి అశ్రు నయనాల మధ్య ప్రజా యుద్ధనౌక గద్దర్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. పోలీసుల గౌరవ వందనం.. స్లో మార్చ్, డెత్ మార్చ్లతో గన్ పార్క్కు అంతిమ యాత్ర బయలుదేరింది. గద్దర్ పార్థివదేహాన్ని ఎల్బీస్టేడియం నుంచి అమరవీరుల స్థూపానికి తీసుకెళ్లారు. అమరవీరుల స్థూపం వద్ద ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ అంతిమ యాత్రలో వేలాది మంది కళాకారులు, గద్దర్ అభిమానులు పాల్గొన్నారు.
ప్రజా యుద్ధ నౌక గద్దర్ భౌతిక కాయం వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తలసాని మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ.. ఇది చిల్లర రాజకీయాలు చేసే సమయం కాదన్నారు.
ప్రజా యుద్ధ నౌక గద్దర్ నిన్న అస్తమించిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం దీనిపై వివాదం చెలరేగుతోంది. గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారికలాంచనాలతో చేయాలనుకోవడం పోలీసు అమరవీరులను అగౌరవ పరచడమేనంటూ యాంటి టెర్రరిజం ఫోరం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
‘‘పొడుస్తున్న పొద్దు మీద’’.. పాటై వెలిగిన సూరీడు అస్తమించాడు. బండెనక బండి అంటూ గజ్జెకట్టిన గళం మూగబోయింది.
నాకేం కాదు.. నువ్వు ధైర్యంగా ఉండు.. సర్జరీ సక్సెస్ అయితది.. ఆరోగ్యంగా తిరిగొస్తా.. ఇంకో పదేళ్లు బతుకుతాను.. ఆరోగ్యం జాగ్రత్త.. ఇవీ ప్రజా యుద్ధనౌక గద్దర్ చివరిసారిగా తన సతీమణి విమలకు (Gaddar Wife Vimala) చెప్పిన మాటలు. అనుకున్నట్లుగానే గుండె ఆపరేషన్ (Heart Operation) విజయవంతంగా జరిగింది కానీ..
ప్రజా గాయకుడు, యుద్ధనౌక గద్దర్ (Gaddar) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నిర్ణయించింది. జీవితాంతం వారు చేసిన త్యాగాలు ప్రజా సేవకు గౌరవ సూచకంగా దివంగత గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కేసీఆర్ (CM KCR) నిర్ణయించారు..
ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూశారన్న (Gaddar Death) దుర్వార్తను అభిమానులు, కవులు, కళాకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. గద్దర్ను గురువుగా, అన్నగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan) భావిస్తారన్న విషయం తెలిసిందే. ఆయన ఇకలేరన్న విషయం తెలుసుకున్న సేనాని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. గద్దర్తో తనకున్న సాన్నిహిత్యాన్ని, చివరిసారిగా ఆస్పత్రిలో కలిసి మాట్లాడిన విషయాలను గుర్తు తెచ్చుకుని పవన్ భావోద్వేగానికి లోనయ్యారు..
ప్రజా యుద్ధనౌక గద్దర్ (Gaddar) అలియాస్ గుమ్మడి విఠల్ ఆదివారం మధ్యాహ్నం తిరిగిరానిలోకాలకు చేరుకున్నారు. ఆయన మరణంతో అభిమానులు, కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. అపోలో ఆస్పత్రి నుంచి భౌతికకాయాన్ని నగరంలోని ఎల్బీస్టేడియానికి (LB Stadium) తరలించారు...
ప్రజా యుద్ధనౌక గద్దర్ (Gaddar) మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR), పలువురు మంత్రులు, రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ కూడా ఉద్యమ గళానికి సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా.. తెలంగాణ కోసం గద్దర్ చేసిన సాంస్కృతిక పోరాటాన్ని, గద్దర్తో తనకున్న అనుబంధాన్ని గులాబీ బాస్ స్మరించుకున్నారు...