Home » Karimnagar
ఆర్జీ-1లో ఫిబ్రవరిలో 110శాతం ఉత్పత్తి సాధించినట్టు ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్ శనివారం ఒక ప్రక టనలో తెలిపారు. 3.84లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాని గాను 4.22 లక్షల టన్నులు సాధించామని తెలిపారు. ఉద్యోగులు, అధికారులు కలిసి కట్టుగా రక్షణతో పని చేసి ఉత్పత్తి సాధించినందునకు జీఎం అభినందిం చారు.
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ బాక్స్లను బస్సులో కరీంనగర్కు తరలించి తిరుగు ప్రయాణంలో ఉండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది ఎన్నికల సిబ్బంది గాయపడ్డారు.
వేవవిలో సింగరేణి ప్రాంతంలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. సింగరేణి కాలనీలకు నీటి సరఫరా చేసేందుకు గోదావరి మాత్రమే మార్గంగా ఉండడం, గోదావరినది ఎండిపోయిన పరిస్థితుల్లో గనుల నీటిని వాడుకోవాలని యాజమాన్యం భావించింది.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగిందని కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం జెడ్పీ హై స్కూల్, గోదావరిఖని సెక్రర్డ్ హార్ట్ హై స్కూల్ పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.
గోదావరి ఖనికి చెందిన న్యాయవాది కిరణ్జీపై వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి దురుసుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. దీంతో మూడు కోర్టుల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనం తరం అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలూ) ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ఎదుట నిరసన తెలిపారు.
లక్షలు వెచ్చించి నిర్మించిన రైతువేదికలు అలంకార ప్రాయంగా మారాయి. మరుగుదొడ్లు నిర్మించినా నీటి సౌకర్యం లేక అలంకారప్రాయంగా మిగిలాయి.ఊరికి దూరంగా నిర్మించడంతో కొన్ని రైతు వేదికలు మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి.
తెలంగాణలో రెండు టీచర్స్, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబద్, మెదక్ పట్టభద్రుల స్థానంలో గెలుపు ఎవరిదనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడ చతుర్ముఖ పోటీ నెలకొంది.
గోదావరినదిలో నీరు లేక మహా శివరాత్రి పుణ్య స్నానాలకు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ చొరవతో ప్రభుత్వం ఎల్లంపల్లి నీటిని దిగువ గోదావరిలోకి వదిలింది. గోదావరినదిలో నీరు లేని పరిస్థితిపై ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రస్థాయి వైజ్ఞానిక సదస్సుకు జిల్లా సైన్స్ అధికారి, కన్నాల ప్రభుత్వ పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు బి. రవినందన్ రావు ఎంపికైనట్లు డీఈవో మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఎస్సీఈఆర్టీలో నిర్వహించే వైజ్ఞానిక సదస్సుకు హాజరుకావాలని డీఎస్వోకు ఆహ్వానం అందినట్లు తెలిపారు.
మహా శివరాత్రి సందర్భంగా గోదావరినదిలో పుణ్య స్నానాలు చేయటానికి వచ్చిన భక్తులను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. బుధ వారం గోదావరినది తీరాన్ని పుట్ట మధు పరిశీ లించి భక్తులతో మాట్లా డారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇసుక తర లించేందుకే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు ఆపడం లేదన్నారు.