Home » MLC Kavitha
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Scam Liquor Case) అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై నేడు (శుక్రవారం) ఢిల్లీ హైకోర్టులో విచారణ ముగిసింది. కవిత బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను మే 24కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయించింది.
Telangana: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నయా నాటకాలకు తెర లేపుతున్నారని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రఘు నందన్ రావు దుబ్బాకలో ఓడిపోతే కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోలేదా అని అన్నారు. పోలీసులతో డబ్బులు పంచి గెలిచినందుకు కేసీఆర్కు సిగ్గు ఉండాలంటూ వ్యాఖ్యలు చేశారు. వెంకట్ రాంరెడ్డి ఎన్ని కట్టలు కట్టించినందుకు మెదక్ సీటు ఇచ్చావ్ కేసీఆర్ అని నిలదీశారు.
వచ్చే పదేళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మీట్ ది ప్రెస్లో కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జూన్ 5 న 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారన్నారు. బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందన్నారు. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన ఆరుగురు ఎంపీ అభ్యర్థులు కాంగ్రెస్లోకి వస్తామని తనను సంప్రదించారన్నారు.
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Liquor Scam Case) కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha).. సంచలన కామెంట్స్ చేశారు. కోర్టు హాల్ నుంచి బయటకు వెళ్తూ.. ప్రజ్వల్ రేవన్న(Prajwal Revanna) అంశంపై స్పందించారు. మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని విడిచిపెట్టి.. దేశం దాటించి..
దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavita) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే రౌస్ అవెన్యూ కోర్టులో ఈ రోజు(మంగళవారం) మరోసారి ఈ కేసు విచారణ జరిగింది. ఈడీ, సీబీఐ కేసుల్లో నేటితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కోర్టులో దర్యాప్తు సంస్థలు హాజరుపరిచాయి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో (Delhi liquor scam case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కాగా.. ట్రయల్ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా హాజరుపరచాలంటూ కవిత దాఖలు చేసిన పిటీషన్ను కోర్టు అనుమతించినట్లు తెలుస్తోంది. రేపు(మంగళవారం) నేరుగా కోర్టు ముందుకు కవిత రానున్నట్లు సమాచారం.
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Liquor Scam Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) జ్యూడీషియల్ కస్టడీ మే 7వ తేదీతో ముగియనుంది. దీంతో ఆమెను కోర్టు ముందు హాజరుపరచనున్నారు అధికారులు. అయితే, తనను కోర్టుకు నేరుగా హాజరుపరచాలని..
Telangana: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు ఏకిపారేస్తున్నారు. గురువారం కుక్నూర్ పల్లి మండల కేంద్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రఘునందన్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితతో పాటు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై తీర్పును మే 6కి వాయిదా వేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.