Home » New Delhi
పార్టీల సిద్ధాంతాలు, విధానాల విషయంలో 'ఇండియా' కూటమి భాగస్వామ పార్టీల మధ్య సల్ప తేడాలు ఉండవచ్చనీ, కానీ దేశ విద్యా వ్యవస్థ విషయంలో ఎప్పుడూ రాజీపడలేదని రాహుల్ గాంధీ అన్నారు.
అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు చాలా కీలకమని, అయితే ఇందువల్ల ఒనగూరే ప్రయోజనాలను చాలా జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలని ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ అన్నారు.
కాలిన నోట్ల కట్టలు కనిపించాయంటూ చెబుతున్న విజువల్స్ తనపై బురదజల్లి, తన ప్రతిష్టను భంగపరచేందుకు జరిగిన కుట్రగా కనిపిస్తోందని జస్టిస్ యశ్వంత్ వర్మ చెప్పారు. వీడియోలోని కంటెంట్ చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు.
పార్లమెంట్ భవన్లో సోమవారం అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభంకానున్నాయి. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్ సభ స్పీకర్ అవకాశం కల్పించారు. దీంతో సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు లోకసభ సచివాలయం అనుమతి ఇచ్చింది.
'వికసిత్ ఢిల్లీ బడ్జెట్' రూపకల్పన కోసం నిపుణులతో సహా వివిధ వర్గాలను తమ ప్రభుత్వం సంప్రదించిందని, ప్రజల నుంచి ఇ-మెయిల్ ద్వారా 3,300 సూచనలు, వాట్సాప్ ద్వారా 6,982 సూచనలు వచ్చాయని సీఎం రేఖాగుప్తా తెలిపారు.
ఎంసీడీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వేటు వేసే హక్కును ఈ నామినేటెడ్ ఎమ్మెల్యేలు కలిగి ఉంటారు. దీంతో బీజేపీ గెలుపు అవకాశాలు మరింత మెరుగుపడే వీలుంది.
ఢిల్లీ ఆప్ అధ్యక్షుడిగా నియమితులైన సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, తమకు ఓటు వేసిన ప్రజల తరఫున, నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, గ్యాస్ సిలిండర్ హామీలతో బీజేపీకి ఓటు వేసిన ప్రజల తరఫున వారి హక్కులు కాపాండేందుకు తమ గళం వినిపిస్తామని చెప్పారు.
ఆదివారంనాడు ఢిల్లీకి వచ్చిన గిబ్బార్డ్ తొలుత ఇంటెలిజెన్స్ సహకారంపై భారత అధికారులతో చర్చించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ అధ్యక్షతన జరిగిన 20 దేశాల ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ అధికాకుల సంయుక్త సదస్సులో పాల్గొన్నారు.
ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా సహించేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2019లో క్రైస్ట్ చర్చి నగరంపై దాడి అయినా, 2008లో ముంబైపై ఉగ్రవాద దాడులైనా ఒకరటేనన్నారు.
ఇస్లామిట్ టెర్రరిజం ముప్పు ప్రభావం ఇటు భారత్, అటు ఆమెరికాతో పాటు మధ్యప్రాశ్యంలోని పలు దేశాలపై ఉందని, ఉగ్రవాదం పీచమణిచేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు కలసికట్టుగా పనిచేస్తున్నారని తులసీ గబ్బర్డ్ చెప్పారు.