Home » Ramoji Rao
ఈనాడు, రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు, మీడియా దిగ్గజం రామోజీరావు సంస్మరణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను చూసిన రామోజీరావులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని పేర్కొన్నారు. సినిమాలు చేసే సమయంలో రామోజీరావుతో ప్రత్యక్ష అనుబంధం లేదని, అయితే 2008లో నేరుగా ఒకసారి రామోజీరావును కలిసి మాట్లాడానని గుర్తుచేసుకున్నారు.
ఇటీవల స్వర్గస్తులైన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు సంస్మరణ సభను గురువారం ఆంధ్రప్రదేశ్లోని కానూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి..
కృష్ణా జిల్లా కానూరు(Kanuru) వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు(Ramoji Rao) సంస్మరణ సభ నిర్వహణపై మంత్రుల కమిటీ సమీక్ష నిర్వహించింది. సచివాలయం 3వ బ్లాక్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, సత్య కుమార్ హాజరయ్యారు.
జాతీయస్థాయిలో ఉత్తమ పాత్రికేయులకు రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు దివంగత రామోజీరావు పేరిట ఏటా స్మారక అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ఏపీ టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబసభ్యులను మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. రామోజీరావు మరణించిన సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం సీడబ్ల్యూసీ, పార్టీ ఇతర సమావేశాల్లో పాల్గొనాల్సి ఉండడంతో పార్థివ దేహాన్ని చూసేందుకుగానీ, అంత్యక్రియలకు గానీ హాజరు కాలేకపోయారు.
తెలుగువారికి చెందిన సామాజికార్థిక రంగాలలో, రాజకీయాలలో, సాంస్కృతిక జీవనంలో ఐదు దశాబ్దాల పాటు బలమైన ముద్ర వేసిన ప్రభావశాలి చెరుకూరి రామోజీరావు. పత్రికా, ప్రసార రంగాల బాహుబలిగా
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం, తానా సంయుక్తంగా ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతిపట్ల నివాళులు అర్పించాయి.
రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు (Ramoji Rao) అంత్యక్రియలు ముగిశాయి. అంతిమయాత్రను ఫిల్మ్సిటీలోని ఆయన నివాసం నుంచి రామోజీ గ్రూపు సంస్థల కార్యాలయాల మీదుగా స్మారక కట్టడం వరకు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించింది. తెలంగాణ పోలీసులు గౌరవవందనం చేశారు. కార్యక్రమంలో పెద్దఎత్తున పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున ముగ్గురు అధికారులు పాల్గొన్నారు.
మీడియా మొఘల్, ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు అంతిమ యాత్రలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న బాబు..
రామోజీ ఫిల్మ్ సిటీలో ఇవాళ ఉదయం 9గంటలకు రామోజీరావు (Ramoji Rao) అంతిమయాత్ర చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. రామోజీ ఫిల్మ్సిటీలోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది.