Home » Rayachoty
జిల్లాలో అసాంఘీక కార్యకలాపాలపై దృష్టి పెట్టడంతో పాటు కేసుల్లో పురోగతి సాధించాలని ఎస్పీ విద్యాసాగర్నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత వైసీపీ (YSR Congress) నుంచి ఒక్కొక్కటిగా వికెట్లు రాలిపోతున్నాయ్..! కీలక నేతలంతా వైసీపీకి గుడ్ బై చెప్పేసి ఇతర పార్టీల్లో చేరిపోతుండటంతో వైసీపీ విలవిలలాడుతున్న పరిస్థితి.!
మండిపల్లె రాంప్రసాద్రెడ్డి.. (Mandipalli Ramprasad Reddy) అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం..విధేయతను చూపుతానని.. భారతదేశ సార్వభౌమాధికారాన్ని. సమగ్రతను కాపాడుతానని.. బుధవారం విజయవాడలో జరిగిన చంద్రబాబునాయుడు మంత్రివర్గ ప్రమాణస్వీకారంలో.. ప్రమాణం చేసిన మండిపల్లి రాంప్రసాద్రెడ్డే.. ఉమ్మడి కడప జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలలో అదృష్టవంతుడు..
మేమంతా సిద్ధం’ పేరుతో బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం జగన్కు అన్నమయ్య జిల్లా ప్రజలు గట్టి దెబ్బే కొట్టారు.
రాయచోటి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మండి పల్లి రాంప్రసాద్రెడ్డి ఎంపిక కావడంతో మండిపల్లి భవన్ వద్ద శనివారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచా పేలుస్తూ సంబరాలు చేసు కున్నారు.
AP Election 2024: సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో వైసీపీతో తలపడేందుకు రేసుగుర్రాలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు శనివారం ఉండవల్లిలో సంయుక్తంగా తొలిజాబితా అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా నియోజకవర్గాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థులను ప్రకటించిన మూడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి..