Home » RBI
అన్ని వర్తక సముదాయాల్లో కొనుగోలుదారుల ఇచ్చే 10, 20 నాణేలు తీసుకోవాలని, లేకపోతే జైలుకి వెళ్ళాల్సి ఉంటుందని ఆర్బీఐ తాజా ప్రకటన జారీచేసిన సంగతి విదితమే. కానీ దీనికి విరుద్దంగా కొందరు వ్యాపారులు నాణేలను తిరస్కరిస్తున్నారు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక విషయాన్ని ప్రకటించింది. సాధారణ ప్రజలు ఫిక్స్డ్ డిపాజిట్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించింది. ఇటివల నివేదికలో ఆకర్షణీయమైన వడ్డీతో కూడిన ఫిక్స్డ్ డిపాజిట్ల వృద్ధి కరెంట్ ఖాతాలు, పొదుపు ఖాతాల (CASA) వృద్ధిని అధిగమించాయని తెలిపింది.
ఎసిడిటీతో ఆసుపత్రిలో చేరిన శక్తికాంత్ దాస్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, మరో కొద్ది గంటల్లో డిశ్చార్చ్ అవుతారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆర్బీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఆర్థిక సేవల రంగంలోని చిన్న కంపెనీలకు అందుబాటు ధరల్లో క్లౌడ్ డేటా స్టోరేజీ వసతి కల్పించడం లక్ష్యంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) దేశంలో లోకల్ క్లౌడ్ డేటా స్టోరేజీ కేంద్రాలు ఏర్పాటు చేసే యోచనలో ఉంది. వీటిలో ఒకటి హైదరాబాద్లోను, మరొకటి ముంబైలోను
దేశంలో కొన్ని రోజుల క్రితం రైల్వే స్టేషన్, స్కూల్స్, పలు ఆస్పత్రులకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతోపాటు ఇటివల ఎయిర్ పోర్టులకు ఇలాంటి కాల్స్ వస్తే అనేక విమాన సర్వీసులు ఆగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ తాజాగా మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లష్కరే తోయిబా అంటూ ఫోన్ వచ్చింది.
పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోవడం, డిపాజిట్లు లేకపోవడంతో విజయవాడ వన్టౌన్లోని దుర్గా కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లైసెన్సును రద్దు చేస్తూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గతేడాది మే 19వ తేదీన ఆర్బీఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. అప్పటికి చెలామణిలో ఉన్న రూ.2 వేల నోట్ల విలువ ఏకంగా రూ. 3.56 లక్షల కోట్లు. ఆ ప్రకటన తర్వాత ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవడం లేదా తమ ఖాతాల్లో జమ చేసుకోవడం వంటివి చేశారు.
నవంబర్ మాసం ప్రారంభమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని బ్యాంకులకు ఉన్న సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం విడుదల చేసింది.
మన దేశానికి పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ పసిడిని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ఆధీనంలో ఉంటుంది. 1990లలో కొన్ని పరిస్థితుల కారణంగా తాకట్టు పెట్టిన ఈ బంగారాన్నిక్రమంగా దేశంలోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం కీలక పరిణామం జరిగింది.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో వాదనలు వినిపించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సిద్ధంగా ఉండాలని తెలంగాణ హైకోర్టు నిర్దేశించింది.