Home » Student
పెచ్చులు ఊడుతున్న పైకప్పు.. శిథిలావస్థలో ఉన్న భవనాలు.. యాదాద్రి భువనగిరిజిల్లా భువనగిరిలోని గురుకుల పాఠశాల దుస్థితి ఇది! ఆ భవనాలు కూలే ప్రమాదం ఉందని.. విద్యార్థుల భద్రతకు ముప్పు పొంచి ఉందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు ఆందోళన వెలిబుచ్చారు.
రాష్ట్రంలో ఐటీఐ కాలేజీలు, గురుకులాల్లో కనీస వసతుల్లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా సర్కారుకు చీమ కుట్టినట్లు కూడా లేదని, వాటి పరిష్కారంపై కినుక వహిస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. విద్యార్థులు గణాధిత్య, అనిరుధ్ మృతికి గల కారణాలను తోటి విద్యార్థులను అడిగి వారు తెలుసుకున్నారు. అలాగే అస్వస్థతకు గురైన నలుగురు చిన్నారుల పరిస్థితిపై పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
దేశంలోని ఉత్తమ విద్యాసంస్థలకు కేంద్రప్రభుత్వం సోమవారం ర్యాంకులు ప్రకటించింది. వరుసగా ఆరో ఏడాది కూడా ఐఐటీ మద్రాస్ అత్యుత్తమ విద్యాసంస్థగా టాప్లో నిలిచింది. బోధన, సిబ్బంది, సౌకర్యాలు.. ఇలా అన్ని అంశాల్లోనూ ముందు వరుసగా నిలిచింది.
వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘జ్వర స్వైర విహారం’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.
ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో వరదల కారణంగా ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన ఘటనపై చేపట్టిన విచారణ దర్యాప్తు నివేదికను జిల్లా మెజిస్ట్రేట్ (సెంట్రల్) సుధాకర్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఈ దుర్ఘటనకు సంబంధించి మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ), ఢిల్లీ అగ్నిమాపక సేవల (డీఎ్ఫఎస్) అధికారులే పెద్ద లోపాలకు బాధ్యులుగా దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు.
గురుకులాలు సమస్యల నిలయాలుగా మారాయి. సొంత భవనాలున్న గురుకులాల్లో సమస్యలు కొంత తక్కువగా ఉన్నా.. అద్దె భవనాల్లో నడుస్తున్న వాటిలో మాత్రం తిష్ట వేసుకుని కూర్చున్నాయి. కొన్నిచోట్ల సరిపడ తరగతి గదుల్లేవు. పడకల్లేవు. నేలపైనే పడుకుంటున్నారు.
నీట్- పీజీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 170 నగరాల్లోని 416 కేంద్రాల్లో రెండు సెషన్లలో ఈ పరీక్ష జరిగింది. ఎలాంటి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఎట్టకేలకు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 15 రోజుల వ్యవధిలో గురుకులంలో ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఉన్నతాధికారులు స్పందించారు.
అస్వస్థతకు గురైన విద్యార్థిని ఆస్పత్రికి తీసుకెళ్లడంలో వర్సిటీ సిబ్బంది నిర్లక్ష్యం వహించారని, ఆ కారణంగానే అతడు మృతి చెందాడంటూ మల్లారెడ్డి వర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.