Home » Vijayawada
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
Vamsi Bail Petition: వల్లభనేని వంశీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
రాజధాని అమరావతిలో ఉగాది వేడుకలు శుభ్రంగా నిర్వహించేందుకు 50 ఎకరాలు సిద్ధం చేస్తారు. పీ4 విధానాన్ని ఉగాది రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారని సీఎస్ తెలిపారు
ఏపీలో మద్యం కుంభకోణంకు సంబంధించి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇదే అంశంపై నిన్న (మంగళవారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో అక్రమ మద్యం వ్యాపారం జరిగిందని ఎంపీ లావు వివరించారు.
పత్రికలో వచ్చిన వార్తను సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సుల్లో టూరిజం అంశంపై మాట్లాడుతూ ప్రస్తావించారు. ఏ ఇజం లేదు అని తాను నాడు అంటే కమ్యూనిస్టులు తనపై విరుచుకుపడ్డారని... విమర్శలు చేశారని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో శాసన సభ్యుడు మాట్లాడతూ ఖర్చు లేని ఇజం టూరిజమే అంటూ ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు.
Vallabhaneni Vamsi Remand: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా వంశీతో న్యాయాధికారి నేరుగా మాట్లాడారు.
ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనతో ఏపీ రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని, రాజధాని అమరావతిని అసలు పట్టించుకోలేదని మంత్రి నారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక ఇబ్బందులు వచ్చాయన్నారు. ఐఐటీ మద్రాస్ను పిలిపించి భవనాల నాణ్యత పరిశీలించి, కాంట్రాక్టర్లతో చర్చించి కొన్ని సమస్యలు పరిష్కరించామన్నారు.
Vamsi Bail Petition: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ వాదించారు.
‘నేను చెప్పింది చేయాల్సిందే... ప్రభుత్వ స్థలాన్ని అడ్డగోలుగా ఆక్రమించుకుని... భారీ భవంతిని నిర్మించుకున్నా సరే దానిని క్రమబద్ధీకరించాల్సిందే’... ఇదీ ఆ ఎమ్మెల్యే తీరు.. అలా కుదరదని చెప్పినందుకు... ఎమ్మెల్యే అధికారిపై రెచ్చిపోయారు. అసెంబ్లీలోనే ఇద్దరు సీనియర్ రెవెన్యూ అధికారులపై గొడవకు దిగారు.
CM Chandrababu Naidu: విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యేల సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి. అందులో భాగంగా పలువురు ఎమ్మెల్యేల ప్రదర్శనలు అందరిని ఆకట్టుకొన్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. పలువురు ఎమ్మెల్యేల ప్రతిభా పటవాలు ప్రదర్శించారని చెప్పారు. అలాగే ఎమ్మెల్యేల నటనపై ప్రశంసల జల్లు కురిపించారు.