ఒకప్పుడు దూరంలో ఉండేవారి కులాసా లు ఇంటికి వచ్చే పోస్ట్కార్డ్(ఉత్తరం) ద్వారా నే తెలిసేవి. మనసులోని మాటలను, అన్ని విషయాలను సమగ్రంగా రాసి ఎదుటి వారి కి చేరువ చేసేలా గతంలో పోస్ట్కార్డులను విస్తృతంగా వాడేవారు.
చౌటుప్పల్ ప్రాంతం లో నెలకొన్న తీవ్రమైన సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మూసీజలాలను మళ్లించాలని ఆందోల్మైసమ్మ జలసాధన సమి తి ఆధ్వర్యంలో రైతు ఉద్యమాలు ఉధృతమవుతున్నాయి. మూడు నెలలుగాసాగుతున్న సాగునీటి ఉద్యమాలతో గ్రామాల్లోని రైతులు, ప్రజలు ఐక్య ఉద్యమాలబాట పడుతున్నారు.
అంతర్జాతీయ ఆధ్యాత్మిక క్షేత్రానికి భద్రత విషయంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.1200 కోట్లతో నిర్మించిన ఆలయానికి భద్రత కొరవడినట్లు కన్పిస్తోంది.
రూ.600కోట్లతో గంధమల్ల రిజర్వాయర్ను నెల రోజుల్లో పూర్తిచేసి, లక్షన్నర ఎకరాలకు సాగునీరందిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్టలో సన్నబియ్యం పంపిణీలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆలేరు ఎడారిగా మారిందన్నారు.
భువనగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల తో నియోజకవర్గంలోని భువనగిరి, భూదాన్పోచంపల్లి మునిసిపాలిటీలతోపాటు భువనగిరి, పోచంప ల్లి, బీబీనగర్ మండలాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
దామరచర్ల నుంచి వీర్లపాలెం, తాళ్లవీర్పగూడెం, ఉల్సాయిపాలెం, అడవిదేవులపల్లి గ్రామాలకు తరచుగా వివిధ అవసరాల కోసం దామరచర్ల, మిర్యాలగూడ ప్రాం తాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. రైతు లు తమ వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్కు తీసుకురావడానికి, గొర్రెలు, పశువులను సంతకు తరలించడానికి ట్రాక్టర్లు గూడ్స్ ఆటోలపై ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. ఎక్కువగా గిరిజన ప్రజలు నివసిస్తున్నందున చిన్న చిన్న అవసరాలకు టౌనకు వచ్చిపోవడం తప్పని సరైందని రైల్వే ట్రాక్ వల్ల తరుచుగా ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్నారు. కాగా సమస్య పరిష్కారానికి రైల్వే అధికారులు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినప్పటికీ కార్యరూపం దాల్చకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
మండలంలోని చాడ మదిర గ్రామం గడ్డగొల్లబావి అభివృద్ధికి దూరంగా ఉంది. గ్రామంలో అనేక సమస్యలు తిష్ట వేశాయి.
వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
: తెలంగాణ ప్రభుత్వం లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) అమలులో భాగంగా ఆర్థిక సంవత్సరం చివరి రోజైన సోమవారం ఒక్కరోజే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 110 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.
ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల నిర్మూలనపై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ కొత్తపల్లి నర్సింహ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.