ఉచిత దర్శనం టోకెన్లు జారీ కౌంటర్ల తనిఖీ

ABN , First Publish Date - 2022-10-31T20:57:36+05:30 IST

ఉచిత దర్శనం టోకెన్లు జారీ కౌంటర్లను అధికారులు తనిఖీ చేశారు. భూదేవి కాంప్లెక్స్, గోవింద రాజా సత్రాలు, శ్రీనివాసం కేంద్రాల్లో ఉచిత దర్శనం టోకెన్ల ప్రక్రియను...

ఉచిత దర్శనం టోకెన్లు జారీ కౌంటర్ల తనిఖీ

తిరుపతి: ఉచిత దర్శనం టోకెన్లు జారీ కౌంటర్లను అధికారులు తనిఖీ చేశారు. భూదేవి కాంప్లెక్స్, గోవింద రాజా సత్రాలు, శ్రీనివాసం కేంద్రాల్లో ఉచిత దర్శనం టోకెన్ల ప్రక్రియను టీటీడీ ఈఓ ధర్మారెడ్డి పరిశీలించారు. నేటి అర్థరాత్రి నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ చేయనున్నారు. శని, ఆదివారాల్లో రోజుకి 25 వేల టోకెన్లు, మిగిలిన రోజుల్లో రోజుకు 15000 టోకెన్లు జారీ చేయనున్నారు. ఆధార్ కార్డుతో ఒకసారి సర్వదర్శనం టోకెన్ తీసుకుంటే నెలరోజులు వరకు మళ్లీ ఉచిత దర్శన టోకెన్ ఇవ్వరని ఈఓ ధర్మారెడ్డి వెల్లడించారు. ఉచిత దర్శనం టోకెన్లు దొరకని భక్తులకు తిరుమల కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.

Updated Date - 2022-10-31T20:57:39+05:30 IST