Sushant Singh Rajupt Death: సంచలన విషయాలు వెల్లడించిన మార్చురీ సర్వెంట్

ABN , First Publish Date - 2022-12-26T19:41:47+05:30 IST

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి.. వచ్చాయి. రాజ్‌పుట్ హత్యకు

Sushant Singh Rajupt Death: సంచలన విషయాలు వెల్లడించిన మార్చురీ సర్వెంట్

ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ (Sushant Singh Rajput) అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజ్‌పుట్ హత్యకు గురయ్యాడని, ఆయన ఒంటిపై గాయాలున్నాయని కూపర్ ఆసుపత్రిలో మార్చురీ సర్వెంట్‌గా ఉన్న రూప్ కుమార్ షా (Roopkumar Shah) సంచనల విషయాలు బయటపెట్టారు. దీనిపై మీడియాకు ఆయన మరింత వివరణ ఇస్తూ, రాజ్‌పుట్ మరణం ఆత్మహత్యలా కనిపించడం లేదన్నారు. ఆయన ఒంటిపై (మృతదేహం) గాయాలు తనకు కనిపించాయని, ఆ విషయాన్ని తన సీనియర్ దృష్టికి తీసుకు వెళ్లగా, దానిగురించి తర్వాత మాట్లాడదామని ఆయన అన్నారని షా చెప్పారు. రాజ్‌పుట్ హత్య కేసుపై దర్యాప్తు సాగిస్తున్న ఏజెన్సీ ముందు స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు కూడా తాను సిద్ధమేనని తెలిపారు.

''పోస్టుమార్టం రిపోర్టు రాయడం డాక్టర్ల బాధ్యత. న్యాయం జరిగేలా వారు చూడాలి. రాజ్‌పుట్ ఫోటోలు చూపినప్పుడు ఎవరైనా సరే అతను హత్యకు గురైనట్టు చెబుతారు. దర్యాప్తు సంస్థ నన్ను పిలిపిస్తే, నేను కూడా వాంగ్మూలం ఇస్తాను'' అని షా చెప్పారు. 34 ఏళ్ల రాజ్‌పుట్ 2022 జూన్ 14న అనుమానాస్పద స్థితిలో తన ఫ్లాట్‌లో ఉరివేసుకుని మరణించారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కూపర్ ఆసుపత్రికి తెచ్చారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఇది ఆత్మహత్యగా ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు తీవ్ర సంచలనం సృష్టంచడంతో సీబీఐకి కేసును రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ కేసుకు సంబంధించి రాజ్‌పుట్ గాళ్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి, రాజ్‌పుట్ ఫ్లాట్‌మేట్ సిద్ధార్ధ పిథానిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరు బెయిలుపై బయట ఉన్నారు.

Updated Date - 2022-12-26T19:47:57+05:30 IST